Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

వక్కంతం అవుట్ ఆఫ్ ఎన్టీఆర్ క్యాంప్?

వక్కంతం అవుట్ ఆఫ్ ఎన్టీఆర్ క్యాంప్?

వక్కంతం వంశీ..ఎన్టీఆర్ క్యాంప్ లో వున్న రైటర్. ఎప్పటికైనా ఎన్టీఆర్ నే తనను డైరక్టర్ ను చేస్తాడని ఓపిగ్గా వున్న రైటర్. జనతా గ్యారేజ్ తరువాత ఎన్టీఆర్ వక్కంతం వంశీ డైరక్షన్ లోనే సినిమాచేస్తారని నిన్న మొన్నటి వరకు వినిపించింది. కానీ నిన్న ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడుతూ తరువాత సినిమా ఇంకా డిసైడ్ చేసుకోలేదని, కాస్త విశ్రాంతి తీసుకుంటానని, అంత త్వరగా సినిమాలు చేసేయాలన్న ఆతృత లేదని చెప్పేసాడు. 

ఇలా చెప్పడం వెనుక బలమైన కారణమే వుందని తెలుస్తోంది. వక్కంతం వంశీ తనంతట తానే ఎన్టీఆర్ క్యాంప్ వీడి బయటకు వచ్చేసినట్లు తెలుస్తోంది. మరి ఎందుకు అలా వచ్చేసాడు అన్నది తెలియదు కానీ, వచ్చేసిన మాట మాత్రం పక్కా అని తెలిసింది. సో, ఇక ఎన్టీఆర్ తరువాత సినిమా మరి ఎవరు డైరక్ట్ చేస్తారో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?