Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

వంద మంది దంపతులకు సన్మానమా?

వంద మంది దంపతులకు సన్మానమా?

నిర్మాత దిల్ రాజు ఆనందం ఒక రేంజ్ లో వుంది. ఏమాత్రం పేరు లేని రచయిత కమ్ దర్శకుడు సతీష్ వేగ్నిశకు అవకాశం ఇచ్చి, తాను ఆద్యంతం ఇన్ వాల్వ్ అయి, తీసిన శతమానం భవతి కాసుల పంట పండిస్తోంది. నైజాం, విశాఖ మినహా మిగిలిన ఏరియాలు, శాటిలైట్ అమ్మేసి, బ్రహ్మాండంగా టేబుల్ ప్రాఫిట్ చేసుకున్నాడు. 

ఇప్పుడు మళ్లీ అదే నైజాం, వైజాగ్ కలిసి అప్పుడే అయిదు కోట్ల వరకు షేర్ తెచ్చేసాయి. అందుకే శతమానం భవతి తరపున ఓ భారీ కార్యక్రమం ఈ నెల 27 లేదా 28న ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యారు. తన సినీ కెరీర్ లోనే అత్యంత భారీ సభ ఇదని ఆయన ఇప్పటికే ప్రకటించేసారు. ఈ కార్యక్రమంలో వంద మంది సీనియర్ దంపతులకు సన్మానం చేస్తే ఎలా వుంటుంది అని ఆలోచిస్తున్నారట దిల్ రాజు.

మరి దంపతులు ఎవరు? వారిని ఎలా ఎంపిక చేస్తారు? ఇవన్నీ ఇంకా తెలియాల్సి వుంది. ఫీల్ గుడ్ మూవీలు తీస్తారు అని పేరు తెచ్చుకున్న దిల్ రాజు, ఇప్పుడు ఓ మంచి కార్యక్రమం చేయడం ద్వారా అక్కడ కూడా తను డిఫరెంట్ అనిపించుకోవాలని చూస్తున్నట్లుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?