Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఇప్పుడు ఎందుకు మాట్లాడవు సమంత?

ఇప్పుడు ఎందుకు మాట్లాడవు సమంత?

దాదాపు మూడేళ్ల కిందటి మాట. మహేష్ నటించిన వన్-నేనొక్కడినే సినిమా విడుదలకు రెడీగా ఉన్న రోజులవి. ప్రమోషన్ జోరుగా నడుస్తోంది. అలా ప్రచారం కోసం విడుదల చేసిన ఓ స్టిల్ పై సమంత ఫైర్ అయింది. ఇదేం పోస్టర్ అంటూ మండిపడింది. ఎందుకు మహిళల్ని ఇంత అభ్యంతరకరంగా చూపిస్తారంటూ కామెంట్స్ చేసింది. సమంత కామెంట్స్ అప్పట్లో పెద్ద దుమారమే రేపాయి.

మళ్లీ ఇన్నేళ్లకు అలాంటిదే మరో సిచ్యువేషన్ వచ్చింది. రారండోయ్ వేడుక చూద్దాం ఆడియో ఫంక్షన లో మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు సీనియర్ నటుడు చలపతిరావు. ఆ వ్యాఖ్యల్ని అంతా ఖండించారు. సమంత మాత్రం ఇప్పటివరకు రియాక్ట్ అవ్వలేదు. ఇక్కడే మహేష్ అభిమానులకు మండింది. అప్పుడు అంతలా రియాక్ట్ అయిన సమంత ఇప్పుడెందుకు మౌనంగా ఉంటోందని సోషల్ మీడియాలో తెగ డిస్కషన్ నడుస్తోంది.

రారండోయ్ వేడుక చూద్దాంలో హీరో నాగచైతన్య. త్వరలోనే చైతూను సమంత పెళ్లాడనుంది. మరోవైపు ఈ సినిమా నిర్మాత నాగార్జున, సమంతకు స్వయంగా మామగారు అవుతారు. ఇలాంటి సినిమా వేడుకలో వివాదం చెలరేగింది కాబట్టే సమంత సైలెంట్ అయిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. సమంత కూడా అందరిలా ముందుకొచ్చి వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఓ ట్వీట్ చేస్తే మహేష్ ఫ్యాన్స్ శాంతిస్తారేమో. అయినా సినిమాకు, ఆ వ్యాఖ్యలకు ఎలాంటి సంబంధం లేదుకాబట్టి.. సమంత ఖండిస్తేనే మంచిదేమో.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?