ఈ ఏడాదికి ఘనమైన ఆరంభాన్ని ఇస్తుందని ఆశించిన అజ్ఞాతవాసి అనూహ్యమైన పరాజయాన్ని చవిచూసింది. త్రివిక్రమ్ నుంచి ఊహించని రీతిలో తగిలిన షాక్ నుంచి పవర్స్టార్ అభిమానులు కోలుకోలేకపోతున్నారు. రెండవ రోజుకే డెఫిసిట్లు పడిన ఈ చిత్రం కనీసం పండగ వరకు అయినా నిలబడుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అత్తారింటికి దారేది లాంటి ఘన విజయాన్ని ఇచ్చిన ద్వయం కలిసి పని చేయడంతో దీనిపై బయ్యర్లు లెక్క లేకుండా పెట్టుబడి పెట్టేసారు. బయ్యర్లకే తీవ్ర నష్టాలు తప్పవనిపిస్తోన్న ఈ చిత్రంతో థర్డ్ పార్టీల వారికి అయితే కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇక బాలకృష్ణ జై సింహా అయినా పండగకి తగ్గ సినిమా అవుతుందని అనుకుంటే ఇది కూడా బాలయ్య ఇమేజ్కి తగని సెంటిమెంట్ డ్రామాతో విసిగిస్తోంది.
శుక్రవారం తెల్లవారకుండానే ప్రదర్శనలు మొదలైన ఈ చిత్రానికి ఆశాజనకమైన టాక్ లేదు. మాస్ కేంద్రాల్లో బాలయ్య ఇమేజ్ కాపాడుతుందేమో అని భావిస్తున్నారు. ఈ పండక్కి విడుదలవుతోన్న రంగుల రాట్నం, గ్యాంగ్ చిత్రాలైనా కాస్త సందడి చేస్తాయేమోనని మార్కెట్ వర్గాలు ఆశపడుతున్నాయి.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు