Advertisement

Advertisement


Home > Sports - Cricket

పీవీ సింధూ.. రూ.50 కోట్లతో భారీ ఒప్పందం?!

ఒలింపిక్స్ రజత పతక ధారిణి పీవీ సింధూ ఒక భారీ ఎండార్స్ మెంట్ డీల్ కుదుర్చుకోనున్నట్టుగా తెలుస్తోంది. ఏకంగా రూ.50 కోట్ల రూపాయలతో ఒక ఏజెన్సీ సింధూతో ఒప్పందం చేసుకోనున్నట్టు సమాచారం. రానున్న మూడేళ్లకు గానూ ఈ ఒప్పందం ఉంటుందని తెలుస్తోంది. ఒలింపిక్స్ లో ప్రదర్శనతో సింధూ క్రేజ్ అనేక రెట్లు పెరిగిన విషయం విదితమే.

ఒలింపిక్స్ లో రజతం సాధించినందుకు గానూ సింధూపై ప్రభుత్వాలు కోట్ల రూపాయల వర్షం కురిపించాయి. పతకం సాధించినందుకు గానూ ఆమెకు సత్కారాల పరంపర కొనసాగుతూనే ఉంది. దేశం నలుమూలల నుంచి ఆమెకు సత్కార ఆహ్వానాలు వస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో యాడ్ వరల్డ్ కూడా సింధూపై దృష్టి సారించింది. ఆమెను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకోవడానికి అనేక వ్యాపార సంస్థలు ఆసక్తిని చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక మేనేజ్ మెంట్ కంపెనీ ఈ మొత్తం డీల్స్ విలువను రూ.50 కోట్ల ఒప్పందంగా మార్చుతున్నట్టు సమాచారం. సింధూను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకోవడానికి పదహారు సంస్థలు సంప్రదింపులు జరుపుతున్నాయట.

వీటిలో బ్యాంకులు, స్త్రీ సంబంధిత వస్తువుల బ్రాండ్లు, ఫైనాన్షియల్ ఇన్ స్టిట్యూషన్లు, స్పోర్ట్స్ బ్రాండ్లు తదితరాలున్నాయి. ఇది వరకూ ఒలింపిక్స్ లో పతకం సాధించిన వారితో పోలిస్తూ ఈ షట్లర్ కు అమితమైన క్రేజ్ కనిపిస్తోంది ఎండార్స్ మెంట్ ప్రపంచంలో. ఈ నేపథ్యంలో ఈ భారీ మొత్తంతో కూడిన ఒప్పందం కుదిరే అవకాశం ఉందని తెలుస్తోంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?