Advertisement

Advertisement


Home > Sports - Cricket

'విరుష్క' పెళ్ళి.. ఈ గందరగోళమెందుకంట.?

'విరుష్క' పెళ్ళి.. ఈ గందరగోళమెందుకంట.?

క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ, బాలీవుడ్‌ భామ అనుష్క శర్మ గత కొన్నేళ్ళుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ కలిసి షికార్లకు వెళుతున్నారు. 'ఏకాంతంగా' డెస్టినేషన్‌ హాలీడేస్‌ని కూడా ఎంజాయ్‌ చేస్తున్నారు. పెళ్ళికి సంబంధించి ఇరు కుటుంబాల పెద్దల మధ్యా గతంలోనే చర్చలు జరిగాయి. అయినా, ఈ ఇద్దరూ పెళ్ళి పీటలెక్కేందుకు కొంత మొహమాటపడ్డారు. ఆ మొహమాటం కూడా అనుష్క వర్మ, సినీ కెరీర్‌ గురించే.! 

బాలీవుడ్‌లో పెళ్ళయిన హీరోయిన్లకు డిమాండ్‌ ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంటుంది. అలాగని, పెళ్ళయ్యాక అవకాశాలు రావని కాదు. ఈ మధ్య పెళ్ళయిన హీరోయిన్లకూ అవకాశం వస్తున్నా, పెళ్ళికాని హీరోయిన్లకు వుండే డిమాండ్‌తో పోల్చితే పెళ్ళయిన హీరోయిన్లకు డిమాండ్‌ చాలా చాలా తక్కువ. అనుష్క వైపు నుంచే పెళ్ళి విషయమై కొంత మొహమాటం. విరాట్‌ కోహ్లీ మాత్రం పెళ్ళికి రెడీగానే వున్నాడు. అయితే, ఇది నిన్నమొన్నటిదాకా విన్పించిన మాట. 

ఇప్పుడు సీన్‌ మారింది. ఇద్దరూ పెళ్ళి పీటలెక్కేందుకు సిద్ధమయ్యారు. ఇటలీలో ఈ ఇద్దరి పెళ్ళీ జరగనుందన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఇరు కుటుంబాలూ ఇటలీకి వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది. విరాట్‌ సన్నిహితులుగానీ, అనుష్క శర్మ సన్నిహితులుగానీ ఈ పెళ్ళి గురించి ఎక్కడా పెదవి విప్పడంలేదు. 

ఆఫ్‌ ది రికార్డ్‌గా మాత్రం, ఈ ఇద్దరి పెళ్ళి ఇటలీలో జరగనుండడంపై ఇద్దరి సన్నిహాతుల నుంచి ఓ 'లీకేజ్‌' న్యూస్‌ అయితే బయటకు వచ్చేసింది. సో, ఇప్పుడు 'అట' అనుకోవడానికేమీ లేదు. కానీ, ఎందుకింత సస్పెన్స్‌ మెయిన్‌టెయిన్‌ చేస్తున్నారట.? ఏమో, 'విరుష్క' జోడీకే తెలియాలి. కొంతమంది ప్రముఖులు మాత్రమే, విరుష్క డెస్టినేషన్‌ వెడ్డింగ్‌కి వెళుతున్నారట. క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌ సహా, మొత్తం ఓ రెండొందల మంది వరకూ అత్యంత ముఖ్యులైనవారు ఈ వెడ్డింగ్‌కి హాజరు కానున్నారని సమాచారం. 200 మంది అంటే, కొంతమంది మాత్రమే ఎలా అవుతారు.? అన్న ప్రశ్న వస్తోంది కదూ.! 

విదేశాల్లో కాబట్టే, ఈ ఫిగర్‌. అదే ఇండియాలో అయితే వందలాది మంది ప్రముఖులు ఈ ఇద్దరి పెళ్ళికి హాజరవుతారు. అన్నట్టు, వెడ్డింగ్‌ ఇటలీలో జరిగినా గ్రాండ్‌ పార్టీ మాత్రం ముంబైలోనే జరగబోతోందట. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?