ఎట్టకేలకు సినిమా స్టార్ట్ చేశాడు

బ్రో సినిమా తర్వాత గ్యాప్ తీసుకుంటానని అప్పుడే ప్రకటించాడు సాయిధరమ్ తేజ్. యాక్సిడెంట్ నుంచి కోలుకున్న ఈ హీరో, శారీరకంగా ఇంకాస్త ఫిట్ గా తయారవ్వాలని, తన డిక్షన్ ను కూడా మెరుగు పరుచుకోవాల్సిన…

బ్రో సినిమా తర్వాత గ్యాప్ తీసుకుంటానని అప్పుడే ప్రకటించాడు సాయిధరమ్ తేజ్. యాక్సిడెంట్ నుంచి కోలుకున్న ఈ హీరో, శారీరకంగా ఇంకాస్త ఫిట్ గా తయారవ్వాలని, తన డిక్షన్ ను కూడా మెరుగు పరుచుకోవాల్సిన అవసరం ఉందని అప్పట్లో ప్రకటించాడు.

చెప్పినట్టుగానే సాయితేజ్ పూర్తిగా ఫిట్ గా తయారయ్యాడు. కొత్త సినిమా స్టార్ట్ చేశాడు. రోహిత్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ డిఫరెంట్ మూవీ చేస్తున్నాడు సాయితేజ్. ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ మొదలైంది.

ఈ సందర్బంగా విడుదల చేసిన పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. పెద్ద ఎడారి, అందులో చుట్టూ ల్యాండ్ మైన్స్ పెట్టారు. ఆ ఎడారి మధ్యలో ఓ పచ్చటి చెట్టు పెరిగింది. ఇలా ఇంట్రెస్టింగ్ గా పోస్టర్ డిజైన్ చేశారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వస్తోంది ఈ మూవీ.

ఈ షెడ్యూల్ కోసం భారీ సెట్ వేశారు. అందులోనే షూటింగ్ కొనసాగుతుంది. హను-మాన్ లాంటి బ్లాక్ బస్టర్ తీసిన నిరంజన్ రెడ్డి ఈ సినిమాకు నిర్మాత. హీరోయిన్, మ్యూజిక్ డైరక్టర్ ఎవరనేది త్వరలోనే వెల్లడిస్తారు.