మళ్లీ తెలుగులోకి శృతిహాసన్

షార్ట్ గ్యాప్ తర్వాత హీరోయిన్ శృతిహాసన్ మళ్లీ తెలుగులోకి వచ్చేసింది. ఈమధ్య తను ఓ ఆల్బమ్ కంపోజ్ చేసింది. ఆ సాంగ్ పనుల్లో బిజీగా ఉన్న ఈ బ్యూటీ, టాలీవుడ్ సినిమాలకు గ్యాప్ ఇచ్చింది.…

షార్ట్ గ్యాప్ తర్వాత హీరోయిన్ శృతిహాసన్ మళ్లీ తెలుగులోకి వచ్చేసింది. ఈమధ్య తను ఓ ఆల్బమ్ కంపోజ్ చేసింది. ఆ సాంగ్ పనుల్లో బిజీగా ఉన్న ఈ బ్యూటీ, టాలీవుడ్ సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సెట్స్ పైకి వచ్చింది.

లెక్కప్రకారం ఆమె సలార్-2 సినిమా సెట్స్ పైకి రావాలి. అది కూడా గత నెల్లోనే. కానీ ఆ ప్లాన్ అనుకున్నట్టు సాగలేదు. దీంతో మరో మూవీని ఆమె స్టార్ట్ చేసింది.

అడివి శేష్ హీరోగా డకాయిట్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కొత్త షెడ్యూల్ లో శృతిహాసన్ జాయిన్ అయింది. ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న ఈ సినిమా షెడ్యూల్ లో శృతిహాసన్, అడివి శేష్ తో పాటు మరికొంతమంది మందిపై యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.

ఇద్దరు మాజీ ప్రేమికుల కథ ఇది. తమ జీవితాల్ని మార్చుకోవడం కోసం వీళ్లు దోపిడీలు చేయాల్సి వస్తుంది. దీని కోసం వీళ్లిద్దరూ మళ్లీ కలుస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఈ సినిమా స్టోరీ. క్షణం, గూఢచారి లాంటి సినిమాలకు డీవోపీగా పనిచేసిన షానీల్, ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమౌతున్నాడు.

తన ప్రతి సినిమాకు చేసినట్టుగానే ఈ సినిమాకు కూడా అడివి శేష్ కథ-స్క్రీన్ ప్లేపై వర్కవుట్ చేశాడు. షానీల్ తో కలిసి రైటింగ్ లో కూర్చున్నాడు. సుప్రియ నిర్మాతగా తెలుగు-హిందీ భాషల్లో వస్తోంది డకాయిట్.