ఎన్టీఆర్ సినిమా ఆగలేదు.. నిర్మాత క్లారిటీ

దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎప్పుడైతే ప్రభాస్ తో సినిమా స్టార్ట్ చేశాడో, ఆ వెంటనే అతడు ఎన్టీఆర్ తో చేయాల్సిన సినిమాపై పుకార్లు ఊపందుకున్నాయి. మరోవైపు ఎన్టీఆర్, ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీ అవ్వడం, ఆ…

దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎప్పుడైతే ప్రభాస్ తో సినిమా స్టార్ట్ చేశాడో, ఆ వెంటనే అతడు ఎన్టీఆర్ తో చేయాల్సిన సినిమాపై పుకార్లు ఊపందుకున్నాయి. మరోవైపు ఎన్టీఆర్, ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీ అవ్వడం, ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమా కూడా ఉండడంతో.. ప్రశాంత్ నీల్-తారక్ సినిమా ఉండదని అంతా అనుకున్నారు.

కానీ వీటిని పుకార్లుగా కొట్టిపారేశారు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా కచ్చితంగా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.

“ఎన్టీఆర్ తో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై కచ్చితంగా సినిమా ఉంటుంది. అది కూడా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనే ఉంటుంది. కాకపోతే అనుకున్న టైమ్ కంటే కాస్త లేట్ అవుతోంది. సలార్ అయిన వెంటనే ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీ ఉంటుంది.”

ఇలా ఎన్టీఆర్-నీల్ సినిమాపై పూర్తి స్పష్టత ఇచ్చారు నిర్మాతలు నవీన్, రవి. మరోవైపు పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో చేయాల్సిన సినిమా ఎందుకు లేట్ అవుతుందో కూడా వివరించారు.

“నిజానికి మాదే ముందు స్టార్ట్ అవ్వాలి. కానీ అనుకోకుండా దిల్ రాజు వకీల్ సాబ్ మొదలైంది. ఆ తర్వాత మాది అనుకున్నాం. అంతలోనే ఏఎం రత్నం సినిమా కథ రెడీ అయింది. దాంతో పవన్ ఆ సినిమా స్టార్ట్ చేశారు. 

ఇక మాది అంతా సెట్ అయిందనుకున్న టైమ్ లో అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ వచ్చింది. తొందరగా అయిపోతుందని అది స్టార్ట్ చేశారు. అలా మా సినిమా లేట్ అవుతుంది. ఈ ఏడాది జూన్ లో కచ్చితంగా మా సినిమా స్టార్ట్ అవుతుంది.”

బాలయ్య, చిరంజీవితో చేయాల్సిన సినిమాలపై కూడా స్పందించారు ఈ నిర్మాతలు. బోయపాటితో చేస్తున్న సినిమా కంప్లీట్ అవ్వగానే బాలయ్య-గోపీచంద్ మలినేని కాంబోలో సినిమా స్టార్ట్ అవుతుందన్నారు. 

ఇక బాబి దర్శకత్వంలో రాబోతున్న మెగాస్టార్ సినిమాలో పూర్తిగా వింటేజ్ చిరంజీవిని చూస్తారని చెబుతున్నారు. ఘరానా మొగుడు, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు రేంజ్ లో బాబి-చిరంజీవి సినిమా ఉంటుందంటున్నారు.