19న ‘చావు కబురు చల్లగా’

అల్లు అర‌వింద్  స‌మ‌ర్ప‌ణ‌లో బన్నీ వాసు నిర్మాత‌గా  యంగ్ హీరో కార్తికేయ‌, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా నూత‌న ద‌ర్శ‌కుడు కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి తెర‌కెక్కిస్తున్న చిత్రం 'చావు క‌బురు చ‌ల్ల‌గా'. ‌ Advertisement ఇప్పటికే విడుదలైన…

అల్లు అర‌వింద్  స‌మ‌ర్ప‌ణ‌లో బన్నీ వాసు నిర్మాత‌గా  యంగ్ హీరో కార్తికేయ‌, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా నూత‌న ద‌ర్శ‌కుడు కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి తెర‌కెక్కిస్తున్న చిత్రం 'చావు క‌బురు చ‌ల్ల‌గా'. ‌

ఇప్పటికే విడుదలైన టైటిల్.. హీరో కార్తికేయ 'బ‌స్తి బాల‌రాజు' ఫ‌స్ట్ లుక్ లకు సానుకూలమైన రెస్పాన్స్ వచ్చింది, ఆ త‌రువాత క్యారెక్ట‌ర్ వీడియో, లావణ్య త్రిపాఠి ఫస్ట్ లుక్ కి, టీజ‌ర్ గ్లిమ్ప్స్ కి కూడా మంచి స్పంద‌న ల‌భించింది. 

ఈ నేప‌థ్యంలో మార్చి 19న చావుక‌బురు చ‌ల్ల‌గా చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తున్నట్లుగా నిర్మాత బ‌న్నీవాసు గా ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ  అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకునే రీతిన ఈ చిత్రాన్ని సిద్ధం చేస్తున్నామన్నారు. 

జిఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ లో “100% ల‌వ్”, “భ‌లేభ‌లే మ‌గాడివోయ్‌”, ” గీతగోవిందం”, “ప్ర‌తిరోజు పండ‌గే” చిత్రాలు ఘ‌న‌ విజాయాలు సాధించాయి. ఆ లెగ‌సినీ స‌క్సెస్ ఫుల్ గా చావుక‌బురుచ‌ల్ల‌గా ముందుకు తీసుకువెళుతుంద‌నే న‌మ్మ‌కంతో ఉన్నామ‌ని ఆయన అన్నారు. 

నిమ్మ‌గ‌డ్డ టీడీపీ ముద్ర పోగొట్టుకుంటారా ?

రామతీర్థం లోని రాములోరి గుడి…డ్రోన్ కెమెరా