Advertisement

Advertisement


Home > Articles - Special Articles

ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కనిమెట దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండుకార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఏడుగురు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మృతుల్లో ఇద్దరు మహిళలు సహా ఐదుగురు పురుషులు ఉన్నారు. రెండు కార్లలో మొత్తం 11 మంది ప్రయాణిస్తుండగా ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

మృతులు హైదరాబాద్ వాసులుగా తెలుస్తోంది. కార్ల నెంబర్లు: టీఎస్‌08-యూఏ-3801, టీఎస్‌08 ఈక్యూ-8108గా గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?