Advertisement

Advertisement


Home > Articles - Special Articles

కూతుర్ని చంపిన తండ్రి..?

కూతుర్ని చంపిన తండ్రి..?

సిద్ధిపేట జిల్లాలో ఇంటర్ విద్యార్థినిని హత్య చేసి దహనం చేయడం కలకలం సృష్టించింది. మిరుదొడ్డి మండలం రుద్రారం గ్రామంలో సుహాని అనే విద్యార్థినిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. తర్వాత దహనం చేశారు. ఆమెను తండ్రే హత్య చేసి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

శుక్రవారం ఉదయం 11 గంటలప్పుడు మొక్కజొన్న పొలంలో కాపలాకు వెళ్లిన సుహాని.. రాత్రి పదవుతున్నా తిరిగిరాలేదు. దీంతో తండ్రి సంజీవ్.. ఆమె కోసం పొలం దగ్గరకు వెళ్లాడు. పంట మధ్యలో సుహానిని ఎవరో దహనం చేసుండడం కనిపించింది. దీంతో గ్రామస్థులందరినీ పిలిపించి రాత్రంతా పొలం దగ్గరే ఉన్నారు.

ఉదయం వచ్చిన పోలీసులు డాగ్ స్క్వాడ్‌తో దుండగుల అడుగుజాడల కోసం గాలించారు. అవి సంజీవ్ దగ్గరికి వెళ్లి ఆగిపోవడంతో.. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నిస్తున్నారు. గ్రామస్థులు కూడా సంజీవ్‌పైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వివాహేతర సంబంధానికి అడ్డొస్తోందని కూతుర్ని చంపి ఉంటాడని చెబుతున్నారు.

ఘటనా స్థలంలో ఉన్న కిరోసిన్ డబ్బాతోపాటూ ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుహాని హత్యపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతదేహం పడి ఉన్న ప్రదేశాన్ని చూస్తే ఎక్కడో చంపి అక్కడకు తీసుకొచ్చి దహనం చేసినట్టు తెలుస్తోంది. సంజీవ్‌ను విచారించడంతోపాటూ దీనివెనక వేరే ఎవరైనా ఉండచ్చొనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సుహానీ మృతదేహానికి పోస్టుమార్టం చేస్తే ఏం జరిగిందనే వివరాలు బయటికొస్తాయని పోలీసులు భావిస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?