Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

13 కోట్ల రేంజ్ లో తేజ్ బిజినెస్?

13 కోట్ల రేంజ్ లో తేజ్ బిజినెస్?

సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ సినిమా తేజ్ ఐ లవ్యూ. ఈ సినిమాకు బిజినెస్ కావడం కష్టమే అయింది వాస్తవానికి. ఎందుకంటే తేజు ఫామ్ లో లేకపోవడం అలాగే దర్శకుడు కరుణాకరన్  పామ్ లో లేకపోవడం. ఆఖరికి మెగాస్టార్ చిరంజీవి వేదిక మీద చరణ్ తరువాత సినిమా కేఎస్ రామారావుకు చేస్తారని ప్రకటించడం కాస్త కలిసివచ్చింది. అలాగే విజయ్ దేవరకొండ సినిమా ఒకటి నిర్మాతకు వుండడం కూడా పనికి వచ్చింది.

అయినా కూడా ఇంకా బిజినెస్ అయితే పూర్తి కాలేదని తెలుస్తోంది. ఆంధ్ర ఆరు కోట్లు రేషియో చెబుతున్నట్లు వినికిడి. వైజాగ్ మాత్రం గాయత్రీ దేవి ఫిలింస్ కు విక్రయించినట్లు బోగట్టా. మిగిలిన ఏరియాలు ఇంకా డిస్కషన్లు నడుస్తున్నట్లు తెలుస్తోంది. సీడెడ్ కేఎస్ రామారావు తన పాత బయ్యర్ కే అందించినట్లు తెలుస్తోంది. నైజాం ఏరియాను ముందు దిల్ రాజు ను పంపిణీ చేయమని కోరినట్లు తెలుస్తోంది. కానీ తరువాత వేరే వాళ్లకు నాలుగు కోట్ల రేషియోలో విక్రయించినట్లు తెలుస్తోంది.

ఆ విధంగా మొత్తం మీద వైజాగ్, సీడెడ్, నైజాం, ఓవర్ సీస్, శాటిలైట్, డిజిటల్ అయ్యాయి. ఆంధ్రలోని మిగిలిన ఏరియాలు కూడా అయిపోతే నిర్మాత సేఫ్ అవుతారు.

సినిమాకు 16 వరకు అయినట్లు తెలుస్తోంది. టోటల్ మార్కెటింగ్ ఫినిష్ అయితే 18 నుంచి 20 వరకు వచ్చే అవకాశం వుంది. అయితే రిజల్ట్ ను బట్టి సినిమాకు ఏ మేరకు లాభం మిగులుతుందన్నది తేలుతుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?