ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న రజినికాంత్, శంకర్ల '2.0' ఇప్పుడప్పుడే రాదని తేలిపోయింది. ఏప్రిల్ 27న విడుదలవుతుందని రజనీ ప్రకటించిన ఈ చిత్రం ప్రస్తుతానికి నిరవధికంగా వాయిదా పడింది.
అందుకే అదే డేట్కి రజనీ నటిస్తోన్న మరో చిత్రం 'కాలా'ని విడుదల చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. చాలా కాలంగా నిర్మాణంలో వున్న 2.0 ఇంతకీ ఎందుకు వాయిదా పడినట్టు? ఈ చిత్రంలో గ్రాఫిక్స్ అంతర్జాతీయ ప్రమాణాలతో వుండాలనే ఉద్దేశంతో ఆ బాధ్యతని ఒక అమెరికన్ కంపెనీకి అప్పగించాడు శంకర్.
అయితే ఆ కంపెనీ ఆర్థిక ఇబ్బందుల్లో పడి దివాలా తీసింది. అంతే కాకుండా ఈ చిత్రానికి వారు ఇంతవరకు చేసిన గ్రాఫిక్స్ పని కూడా శంకర్ ఆశించిన స్థాయిలో లేదట. దీంతో ఇప్పుడు వేరే కంపెనీకి ఇవ్వడమే కాకుండా మళ్లీ ఆ వర్క్ అంతా తిరిగి చేయాలట. దీంతో 2.0 అసలు ఈ ఏడాదిలో రిలీజ్ కాకపోవచ్చుననే ఊహాగానాలు మొదలయ్యాయి.
వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం రిలీజ్ అవ్వవచ్చునని అంటున్నారు. దీంతో ఈ చిత్రం రైట్స్ తీసుకుని భారీ అడ్వాన్సులు ఇచ్చిన వాళ్లంతా కంగారు పడుతున్నారు. 2.0 తెలుగు రైట్స్ కోసం ఏషియన్ ఫిలింస్ వాళ్లు భారీ అడ్వాన్స్ ఇచ్చారు. ఇలాంటి వాళ్లందరినీ ఇప్పుడు ఈ చిత్ర నిర్మాతలు వడ్డీ భారంలో పడేసారు.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు