Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

22 నుంచి పికె..ఎకె షూట్

22 నుంచి పికె..ఎకె షూట్

పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ షూట్ పూర్తయింది. క్రిష్ డైరక్షన్ లో చేసే రెండో సినిమా రెండో షెడ్యూలు పూర్తి కావస్తోంది. దాంతో ఆ సినిమా ఓ 15 నుంచి 20 శాతం వర్క్ పూర్తి చేసుకుంటుంది. ఆపైన దాన్ని పక్కన పెట్టి అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ మీదకు వస్తున్నారు. 

త్రివిక్రమ్ పర్యవేక్షణలో తయారయ్యే ఈ సినిమా 22న నుంచి సెట్ మీదకు వస్తుంది. 24 లేదా 25న పవన్ కళ్యాణ్ సెట్ మీదకు వస్తారు. 

అయ్యప్పన్ కోషియమ్ కు దర్శకుడు త్రివిక్రమ్ చేసిన కీలక మార్పు మేరకు ఓ ఫ్లాష్ బ్యాక్ సీన్ షూటింగ్ ను ఈ షెడ్యూలులో ఫినిష్ చేస్తారు. ఆ తరువాత షెడ్యూలు కొద్ది రోజుల గ్యాప్ తరువాత వుంటుంది.

ఎకె రీమేక్ పూర్తయిన తరువాతే మళ్లీ క్రిష్ సినిమా షెడ్యూలు వుంటుంది. ఈ లెక్కన 2021లో విడుదలయ్యే పవన్ సినిమాల జాబితాలో క్రిష్ సినిమా వుండకపోవచ్చు. ఏప్రిల్ 9న వకీల్ సాబ్, దసరాకు ఎకె రీమేక్ వుండొచ్చు. 

ఆపై 2022 లో క్రిష్ సినిమా విడుదల వుండే అవకాశం వుంది. పవన్ కళ్యాణ్ ఎకె రీమేక్ పూర్తయిన తరువాత క్రిష్ సినిమా మీదకు వెళ్లి, ఆపై హరీష్ శంకర్ సినిమాను ప్రారంభిస్తారు. అది కూడా 2022 లోనే విడుదల వుండే అవకాశం వుంది

చంద్ర‌బాబు పై జేసీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

ఏపీలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభం 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?