Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆ యాక్టర్ రేటు పెంచేసారట

ఆ యాక్టర్ రేటు పెంచేసారట

ఒక్క సినిమా గట్టి హిట్ అయితే చాలు, రేట్లు పెంచుతారు నటులు. అది కామన్. అయితే కరోనా టైమ్ లో హీరోలతో సహా నటీనటులు అంతా రేట్లు తగ్గించుకోవాలని నిర్మాతల గిల్డ్ కోరుతుంటే నటుడు మురళీ శర్మ మాత్రం రేటు పెంచినట్లు ఇండస్ట్రీలో గ్యాసిప్ వినిపిస్తోంది.

అలవైకుంఠపురములో సినిమా ఆయనకు మంచి పేరు తీసుకువచ్చింది. దాంతో ఆయన రేటు రోజుకు రెండులక్షల పాతిక వేలకు చేరిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి.

గతంలో ఆయన లక్షన్నర మేరకు డైలీ లెక్కన తీసుకునేవారు.  ప్రతి రోజూ పండగే, అల వైకుంఠపురములో,  సరిలేరు నీకెవ్వరూ అంటూ వరుసగా రెండు హిట్ లు పడడంతో రేటు పెంచేసినట్లు తెలుస్తోంది. నిజానికి మురళీ శర్మ ఇప్పుడు ఫుల్ బిజీ నటుడు. నారప్ప, శ్రీకారం, రాథేశ్యామ్ ఇలా చాలా సినిమాలు వున్నాయి చేతిలో. 

దాంతో రేటు నుంచి లక్షన్నర నుంచి రెండు లక్షల పాతిక వేలకు పెంచినట్లు తెలుస్తోంది. గిల్డ్ రేట్లు వెనక్కు తీసుకెళ్దామని చూస్తుంటే కీలక నటులు ముందుకు తీసుకెళ్తున్నారు. నటులే ఇలా చేస్తే, ఇక హీరోల రెమ్యూనిరేషన్లు ఎలా కంట్రోల్ చేయగలదు గిల్డ్?

న్యాయ వ్యవస్థపై యుద్ధం ప్రకటించిన జగన్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?