Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆ ఇద్దరూ ఒకే వేదికపైకి.. చాన్నాళ్లకు

ఆ ఇద్దరూ ఒకే వేదికపైకి.. చాన్నాళ్లకు

ఈ నెల 25 టాలీవుడ్ లో ఆసక్తికరంగా వుండబోతోంది. చాన్నాళ్ల తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ సినిమా ఫంక్షన్ కు రానుండడం ఒక ఆసక్తి అయితే, అదే ఫంక్షన్ లో ఆయన సన్నిహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా పాల్గొనబోతుండడం మరో విశేషం. ఈ ఇద్దరు కలిసి కనిపించి దాదాపు మూడునెలలు దాటిపోతోంది.

అజ్ఞాతవాసి సినిమా ఫంక్షన్ డిసెంబర్ రెండో వారంలో జరిగింది. మళ్లీ ఆ తరువాత త్రివిక్రమ్ ఎక్కడా బయట కనిపించలేదు. అజ్ఞాతవాసి ఫలితం ఆయనను కాస్త ఇబ్బందికి గురిచేసింది. ఆ సినిమా హిట్ అయివుంటే, మళ్లీ కనిపించి వుండేవారు. కానీ అలా జరగలేదు. దాంతో ఆయన తన తరువాత సినిమాపై బిజీ అయిపోయారు.

పవన్ కళ్యాణ్ రాజకీయ సమావేశాల్లో కనిపిస్తున్నారు కానీ, సినిమా సంగతులు, సినిమా మాటలు ఆయన నోట వినలేదు. పైగా పవన్ ఆయన సన్నిహితుడు త్రివిక్రమ్ కలిసి అస్సలు కనిపించలేదు. ఇప్పుడు అలా దాదాపు మూడు నెలల తరువాత ఒకే వేదికపై కనిపించబోతున్నారు. నితిన్ హీరోగా తయారైన ఛల్ మోహన్ రంగ సినిమాకు సమర్పకుడు పవన్ కళ్యాణ్. ఆ సినిమాకు కథ అందించింది త్రివిక్రమ్ శ్రీనివాస్. అందువల్ల ఈ సినిమా ఫంక్షన్ కు ఆ ఇద్దరు రాబోతున్నారు.

నితిన్ ఈ విషయాన్ని ధృవీకరించారు. పవర్ స్టార్ చీఫ్ గెస్ట్ అని నితిన్ ట్వీట్ చేసారు. అయితే త్రివిక్రమ్ సంగతి ప్రస్తావించలేదు. కానీ దర్శకుడు కృష్ణ చైతన్య అంటే త్రివిక్రమ్ కు ఇష్టం. అందుకే తివిక్రమ్ రాకుండా వుండకపోవచ్చు. సో, మరోసారి త్రివిక్రమ్ నోట పవన్ కళ్యాణ్ మీద పొగడ్తలు వినే అవకాశం సినిమా అభిమానులకు కలగబోతోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?