Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అనుపమ నో చెప్పిందా?

అనుపమ నో చెప్పిందా?

అసలే కరోనా టైమ్. సినిమాలు ఎప్పుడు ప్రారంభమవుతాయో? ఎప్పుడు విడుదలవుతాయో తెలియని పరిస్థితి. ఇలాంటి టైమ్ లో కొత్త కొత్త గ్యాసిప్ లు వినిపిస్తూ మరింత కలవరం కలిగిస్తున్నాయి. ఎప్పటి నుంచో వార్తల్లో వినిపిస్తున్న కార్తికేయ 2 సినిమాను పీపుల్స్ మీడియా, అభిషేక్ అగర్వాల్ కలిసి నిర్మించడానికి ముందుకు వచ్చారు. ఆ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ అని వార్తలు వినిపించాయి. నిజానికి నిర్మాతలు ఇప్పటి వరకు హీరోయిన్ పేరును ప్రకటించలేదు. దర్శకుడు మాత్రం అనుపమ వైపు మొగ్గు చూపుతున్నారని వార్తలు వచ్చాయి. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమాలో అనుపమ చేయడం లేదని తెలుస్తోంది.

సినిమా బడ్జెట్ పరిమితులకు మించి అనుపమ డిమాండ్ చేయడం ఒక కారణం అని, పైగా అసలు సినిమా ఎప్పుడు వుంటుందో తెలియదు కనుక, ఇంకా ఏమీ డిసైడ్ కాలేదని తెలుస్తోంది. ఈసినిమా షూట్ దేశంలోని పలు రాష్ట్రాల్లో, ఇంకా విదేశాల్లోని అనేక చోట్ల జరగాల్సి వుంది.కరోనా కల్లోలం చల్లారేవరకు ఇది అసాధ్యం. అందుకే హీరోయిన్ గురించి ఇప్పట్లో డిసైడ్ కాదని తెలుస్తోంది.

మూడు చానల్స్ రెండు పేపర్లతో రాజకీయం

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?