Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బిగ్ బాస్ లో బయటకు రాని టాస్క్

బిగ్ బాస్ లో బయటకు రాని టాస్క్

బిగ్ బాస్ హవుస్ లో 24 గంటల పాటు జరిగే ఫుటేజ్ ను గంటకు కుదించి ప్రేక్షకులకు అందిస్తారు. ఇక్కడే జరిగే మతలబు అంతా జరుగుతుంది అంటూ వుంటారు బయటకు వచ్చిన ప్రతి కంటెస్టెంట్.

అక్కడ తాము చేసినది చూపిస్తే కదా ప్రేక్షకులు నచ్చి ఓట్లు వేసేది. అలా కాకుండా వాళ్లు ఎవరికి ఓట్లు రావాలనుకుంటారో వాళ్లనే ప్రొజెక్ట్ చేస్తుంటాని చెబుతుంటారు. ఇదెంతవరకు నిజం అన్నది బిగ్ బాస్ నిర్వాహకులకే తెలియాలి.

అలాగే ఓట్ల ఆధారంగానే ఎలిమినేషన్లు వుంటాయని అంటారు. కానీ బయటకు వచ్చిన ప్రతి కంటెస్టెంట్ కూడా తమకు ఓట్లు బాగానే వేసారని బయటకు వచ్చిన తరువాత తెలుస్తోందని, కానీ ఎందుకు ఎలిమేనేట్ చేసారో తెలియడం లేదని అంటూ వుంటారు. దీని మతలబు కూడా బిగ్ బాస్ నిర్వాహకులకే తెలియాలి. 

ఇదిలా వుంటే ఈ వారం బయటకు వచ్చాడు కుమార్ సాయి. బయటకు వచ్చే లోగా అనేక గేమ్స్ ఆడాడు. టాస్క్ లు చేసాడు. అయితే బయటకు రాని టాస్క్ ఒకటి వుంది అని తెలుస్తోంది. అదే అత్యంత వేగంగా పిండి రుబ్బే టాస్క్.

ఈ టాస్క్ కారణంగా కుమార్ సాయి చేతికి కాస్త గాయం కూడా అయినట్లు బోగట్టా. ఆ కారణంగానే ఆ టాస్క్ ఫుటేజ్ మొత్తం చూపించలేదని తెలుస్తోంది. అంతే కాదు, గాయానికి సరైన మెడికల్ ఎయిడ్ కూడా ఇవ్వలేదని బయటకు వచ్చాక కుమార్ సాయి సన్నిహితుల దగ్గర బాధపడినట్లు తెలుస్తోంది.  

ఒక్కో కంటెస్టెంట్ బయటకు వస్తుంటే ఇలాంటి వింతలు ఇంకా ఎన్ని బయటకు వస్తాయో?

జగన్ చేస్తున్నది అర్ధం కావాలంటే

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?