Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

గోపీచంద్ మైండ్ గేమ్

గోపీచంద్ మైండ్ గేమ్

మాస్ సినిమాల నుంచి క్లాస్ కు మారదామని అనుకున్న రెండు సార్లు (మొగుడు, జిల్) గోపీచంద్ కోరిక నెరవేరలేదు. అలా అని రొడ్డ కొట్టుడు మాస్ ను ఎవ్వరూ చూడడం లేదు. అందుకే మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్లలోనే కాస్త భిన్నమైన సినిమాలు చేయాలనుకుంటున్నాడు.

అందులో భాగంగానే కొత్త డైరక్టర్ చక్రవర్తితో కలిసి 'పంతం' అనే సినిమా చేస్తున్నాడు. కేకె రాధామోహన్ నిర్మాత. ఈ సినిమా ఫస్ట్ లుక్ బయటకు వచ్చింది. వాస్తవానికి నిర్మాతకు గురువారం సెంటిమెంట్ కావడంతో అదే రోజు ఈ లుక్ ను విడుదల చేయాలనుకున్నారు.

కానీ ఫ్యాన్స్ అత్యుత్సాహంతో ఆ లుక్ కాస్తా వన్ డే ముందే బయటకు వచ్చేసింది. ప్రసాద్ మూరెళ్ల, గోపీసుందర్, ఎఎస్ ప్రకాష్ లాంటి స్టార్ టెక్నీషియన్లు పనిచేస్తన్న ఈ సినిమా కాస్త డిఫరెంట్ మైండ్ గేమ్ వుంటుందని తెలుస్తోంది. ఈ పర్టిక్యులర్ పాయింట్, నెరేషన్ కారణంగా, ఈ సినిమా మిగిలిన యాక్షన్ ఎంటర్ టైనర్లకు భిన్నంగా వుంటుందని తెలుస్తోంది.

ఫస్ట్ లుక్ లో గోపీచంద్ కూడా కాస్త డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు ఫిజిక్ కాస్త ఛబ్బీగా వుంది. కొద్దిగా మాసిని గెడ్డంతో కాస్త డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. చూడాలి మరి ఈ పంతం సినిమా గోపీచంద్ కెరీర్ కు ఏ మేరకు హెల్ఫ్ అవుతుందో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?