Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

కేరళ బాధితులకు ‘చిరు’సాయం

కేరళ బాధితులకు ‘చిరు’సాయం

కేరళ వరద బాధితుల కోసం ఎవరిసాయం వారు చేస్తున్నారు. మెగా ఫ్యామిలీ వంతున కూడా మెగాస్టార్ చిరంజీవి కొంతసాయం ప్రకటించారు. చిరంజీవి తల్లి లక్షరూపాయలు, ఆయన స్వయంగా పాతికలక్షలు కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రకటించారు.

ఇక యంగ్ మెగాస్టార్ రామ్ చరణ్ తనవంతు సాయంగా పాతిక లక్షలు అందించబోతున్నారు. కోడలు ఉపాసన సుమారు 10 లక్షల విలువైన మందులు పంపించబోతున్నారు.

ఇవన్నీ ఇవ్వాళ, రేపట్లో అందే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే మెగా హీరో బన్నీ తనవంతు సాయం ప్రకటించారు. అలాగే గీతాఆర్ట్స్ నిర్మించిన గీతగోవిందం కేరళ వెర్షన్, అక్కడ విడుదలైన తెలుగు వెర్షన్ లాభాలు కూడా సిఎమ్ ఫండ్ కే ఇస్తామని ప్రకటించారు.

ఇవికాక మిగిలిన మెగా హీరోలు కూడా ఇవ్వాళో, రేపో తమవంతు సాయం ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?