డ్రగ్స్ వ్యవహారంలో నటి సంజనను అదుపులోకి విచారిస్తున్నారు కర్ణాటక పోలీసులు. ఈ వ్యవహారం ఇప్పుడు పొలిటికల్ టర్న్ కూడా తీసుకున్నట్టుగా ఉంది.
ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఒకప్పటి జేడీఎస్ నేత ఒకరితో సంజన శ్రీలంక వెళ్లినట్టుగా ఒక సెలబ్రిటీలకు మేనేజర్ గా వ్యవహరించే ఒక వ్యక్తి వ్యాఖ్యానించడం రాజకీయంగా దుమారం రేపుతూ ఉంది.
ఇప్పటికే ఆమెకు భారీగా ఆస్తులున్నాయని అంటూ విచారణ సంస్థలు మీడియాకు లీకులు ఇచ్చాయి. బెంగళూరు పరిధిలోనే సంజనకు పది వరకూ ఫ్లాట్లు ఉన్నట్టుగా ఆ సంస్థలు తేల్చాయట. చాలా చిన్న హీరోయిన్ అయిన ఆమెకు అన్ని ఆస్తులు ఎలా వచ్చాయనే అంశం గురించి ఆ సంస్థలు పరిశోధిస్తున్నాయట.
ఇంతలో ఆమెను ఒక రాజకీయ నేత తన వెంట శ్రీలంకకు తీసుకెళ్లాడనే విషయం పై పుకార్లు గుప్పుమంటున్నాయి. ఈ విషయాన్ని సదరు రాజకీయ నేత కూడా మీడియా ముఖంగా ధ్రువీకరించినట్టుగా తెలుస్తోంది.
తను చాలా సార్లు కొలంబోకు వెళ్లినట్టుగా ఆ నేత చెప్పాడట, కానీ సంజనను తను తీసుకెళ్లినట్టుగా ఆయన ఒప్పుకోలేదు.
ప్రస్తుతం అహ్మద్ జమీర్ అనే ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయన గతంలో జేడీఎస్ లో ఉండేవారని, అప్పట్లో సంజనతో ఈయన శ్రీలంకకు వెళ్లాడని ఒక మేనేజర్ వ్యాఖ్యానించాడు.
జేడీఎస్ వ్యూహాత్మక సమావేశాలు ఒకసారి కొలంబోలో జరిగాయని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంతకు మించి తమకూ సంజనకు సంబంధం లేదని ఆ పార్టీ వర్గాలు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం జరుగుతున్నాయి.
కర్ణాటకలో జూదం పిచ్చి ఉన్న వాళ్లు చాలా మంది శ్రీలంకకు వెళుతూ ఉంటారు. అక్కడ క్యాసినోల్లో ఖర్చు పెడితే చాలు, విమానం టికెట్లను ఫ్రీగా ఆఫర్ చేస్తూ కొంతమంది ఏజెంట్లు సామాన్యులను కూడా రెచ్చగొట్టి తీసుకెళ్తూ ఉంటారు.
ఈ క్రమంలో సంజన వ్యవహారంతో- రాజకీనేతల కొలంబో టూర్లు చర్చనీయాంశంగా మారాయి.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు