Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మోహన్ లాల్-అరవింద్ స్వామి కలిసి

మోహన్ లాల్-అరవింద్ స్వామి కలిసి

హీరో అఖిల్ తో ఎకె బ్యానర్ మీద అనిల్ సుంకర నిర్మించే సినిమా పై మాంచి అప్ డేట్స్ వినిపిస్తున్నాయి. ఆన్ పేపర్ ఈ సినిమా బడ్జెట్ 40 కోట్లు అని తెలుస్తోంది. 

ఈ సినిమా కోసం దర్శకుడు సురేందర్ రెడ్డి భారీ స్టార్ కాస్ట్ ను దింపుతున్నాడు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, తమిళ టాలెంటెడ్ ఆర్టిస్ట్ అరవింద్ స్వామిలను ఈ సినిమాలో నటించేందుకు ఒప్పించినట్లు తెలుస్తోంది.

ఇంకా ఈ సినిమా కోసం టాప్ హీరోయిను, ఇంకా గట్టి స్టార్ కాస్ట్ ను సెట్ చేసేందుకు డిస్కషన్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం చేస్తున్న బ్యాచులర్ సినిమా పూర్తి కావస్తోంది. 

ఈ సినిమాను సమ్మర్ బరిలోదింపుతారు. బ్యాచులర్ మీద తన వర్క్ పూర్తికాగానే అఖిల్ నేరుగా సురేందర్ రెడ్డి సినిమా మీదకు వస్తాడు.

ఇప్పటికే మహాసముద్రం సినిమా నిర్మిస్తూ, మెగాస్టార్ సినిమా, మహేష్ సినిమాలను ప్లానింగ్ లో పెట్టుకుని అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తారు.

జ‌య‌మ్మ క్యారెక్ట‌ర్ ఇంత బాగా రావడానికి కార‌ణం అయ‌నే

మంచి కిక్‌ ఇచ్చారు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?