నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంపై మొదలైన విచారణ పూర్తిగా డ్రగ్స్ మలుపు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ఇప్పటికే నటి రియాచక్రబర్తిని ఎన్సీబీ విచారించి, అరెస్టు చేసింది. ఈ సందర్భంగా పలువురు డ్రగ్స్ డీలర్ల గుట్టు బయటపడిందని, వారి ద్వారా బాలీవుడ్ లో ఎవరెవరికి డ్రగ్స్ అందాయనే అంశం గురించి కూడా క్లూస్ లభించినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఇప్పటికే పలువురి పేర్లు వార్తల్లోకి వచ్చాయి.
ఈ క్రమంలో పలువురు ప్రముఖ నటీమణులను ఎన్సీబీ విచారించినున్నట్టుగా మరోసారి ప్రచారం ఊపందుకుంది. వారికి సమన్లు జారీ అవుతాయని, వారిని ఎన్సీబీ విచారణకు పిలుస్తుందని ప్రచారం జరుగుతూ ఉంది.
ఈ జాబితాలో బాలీవుడ్ టాప్ హీరోయిన్ల పేర్లు వినిపిస్తూ ఉండటం గమనార్హం. దీపికా పదుకునే, శ్రద్ధకపూర్, సారా అలీఖాన్ వంటి హీరోయిన్ల పేర్లు ఈ వ్యవహారంలో వినిపిస్తున్నాయి. దీపిక, శ్రద్ధలకు డ్రగ్స్ అందినట్టుగా.. కొన్ని కోడ్ పేర్లతో వారి గురించి డ్రగ్స్ పంపిణీదారులను ప్రస్తావించినట్టుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఈ మేరకు వారిని ఎన్సీబీ విచారణకు పిలవనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా మరోసారి వినిపిస్తూ ఉండటం గమనార్హం. ఇది వరకే రకుల్ పేరు ప్రస్తావనకు రాగా, తన గురించి మీడియాలో వచ్చే కథనాలను నిరోధించాలని కోరుతూ ఆమె కోర్టుకు ఎక్కినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే జాతీయ మీడియా కథనాల్లో మరోసారి రకుల్ కు కూడా సమన్లు జారీ అవుతాయనే ప్రచారం జరుగుతూ ఉంది.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు