Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఎన్టీఆర్ - హీరోయిన్ మారలేదు !

ఎన్టీఆర్ - హీరోయిన్ మారలేదు !

ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా ప్లాన్ చేసినప్పుడు వినిపించిన హీరోయిన్ పేరు కియరా అద్వానీ. ఆ సినిమాకు ఫస్ట్ చాయిస్ ఆమె నే. ఆ తరువాత రష్మిక, పూజా హెగ్డే పేర్లు వినిపించాయి. 

అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. కొరటాల శివతో ఎన్టీఆర్ ప్రాజెక్టు అనౌన్స్ అయింది. ఇప్పుడు ఈ ప్రాజెక్టు కు హీరోయిన్ గా కియారా నే తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. 

కియారా నే ఎన్టీఆర్ ఫస్ట్ చాయిస్. ఆయన ప్రత్యేకంగా కియారా పేరు చెప్పి, డేట్ ల కోసం ట్రయ్ చేయమని చెప్పినట్లు బోగట్టా. 

గతంలో కొరటాల డైరక్షన్ లో కియరా నటించింది. అందువల్ల డేట్ లు కానీ ఓకె అనడం కానీ పెద్ద సమస్య కాదు.పైగా ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా తీస్తున్నారు. 

బాలీవుడ్ స్టార్ ఒకరిని విలన్ గా తీసుకుంటున్నారు. ఈ సినిమా కు సంబంధించిన మరిన్ని వివరాలు ఎక్స్ క్లూజివ్ గా త్వరలో. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?