Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పుష్ప కథ మళ్లీ మొదటికి

పుష్ప కథ మళ్లీ మొదటికి

సుకుమార్-బన్నీ కాంబినేషన్ లో మైత్రీ మూవీస్ నిర్మించే సినిమా  పుష్ప. ఈ సినిమా ఆరంభం నుంచి భూమి గుండ్రంగా వుంది అన్నట్లు అక్కడిక్కడే తిరుగుతోంది.

ఈ సినిమాకు అడవుల బ్యాక్ డ్రాప్ కావాలని, అక్కడే కిందా మీదా అవుతున్నారని తెలిసిందే.ఆరంభంలో అంటే కరోనాకు ముందు కేరళ అనుకున్నారు. తీరా కేరళలో కరోనా ప్రారంభం కాగానే ఆంధ్రలో మారేడుమిల్లి, రంప చోడవరం అనుకున్నారు.

తీరా చేస్తే ఆంధ్రకు కూడా కరోనా వచ్చింది. దాంతో ఆగిపోయింది. కరోనా తగ్గాక వికారాబాద్ అడవుల పేరు వినిపించింది. కానీ ఇన్నాళ్లు ఆగాం కదా, కేరళకే వెళ్దాం అన్న టాక్ వచ్చింది.

కానీ ఇఫ్పుడు ఫైనల్ గా మళ్లీ రంపచోడవరం, మారేడుమిల్లికే వెళ్తోంది యూనిట్. నవంబర్ నుంచి అక్కడ షూట్ ప్రారంభించి, ఆ తరువాత కేరళకు వెళ్తారని తెలుస్తోంది. ఈ మేరకు షెడ్యూళ్లు, ఏర్పాట్లు చేస్తున్నారు. మైత్రీ మూవీస్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.

కేంద్ర కేబినెట్ లో వైసీపీ చేరితే...?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?