Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రాజమౌళి ప్రపోజల్ కు నో చెప్పారు

రాజమౌళి ప్రపోజల్ కు నో చెప్పారు

సాధారణంగా టాప్ డైరక్టర్లు ఏదైనా చెబితే హీరోలు కాదనరు. వాళ్లు ఎలా అంటే అలాగే. అందునా రాజమౌళి లాంటి డైరక్టర్ అంటే ఇంక చెప్పనక్కరలేదు. ప్రభాస్ కేవలం బాహుబలి సినిమా కోసం ఏళ్ల తరబడి మరో సినిమా చేయకుండా అలా వుండిపోయాడు.

ఇప్పుడు ఎన్టీఆర్-రామ్ చరణ్ లదీ అదే పరిస్థితి. అయితే కరోనా వచ్చి ఈ ముగ్గురి కాంబినేషన్ ఆర్ఆర్ఆర్ సినిమాను మరీ ఆలస్యం చేసేసింది.

ఇలాంటి నేపథ్యంలో రాజమౌళి ఓ ప్రతిపాదన చేసారని, దానికి హీరోలు ఇద్దరూ నో చెప్పాలని టాలీవుడ్ లో గ్యాసిప్ వినిపిస్తోంది.  విషయం ఏమిటంటే ఆర్ఆర్ఆర్ వర్క్ ఇంకా చాలా వుంది. కీలకమైన సీన్లు ఏవీ ఇంకా టచ్ చేయలేదని తెలుస్తోంది.

ఈ సినిమాను ఇలాగే తీసుకుంటూ వెళ్తే 2022 సంక్రాంతి లోపు రావడం కష్టం అని టాక్. అందుకే ఈ సినిమాను కూడా రెండు భాగాలు చేసి, తొలి భాగాన్ని 2021 సమ్మర్ కు విడుదల చేస్తే ఎలా వుంటుందని రాజమౌళి ఆలోచన చేసారని, ఈ ప్రతిపాదనను హీరోల ఇద్దరి ముందు వుంచారని తెలుస్తోంది.

దానికి వారు వీటో చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా రెండు భాగాలు అంటే బాగుండదని, పైగా రెండు భాగాలుగా చేసుకుని, కథను ఆ విధంగా సెట్ చేసుకుని ముందుకు వెళ్తే ఇంకా చాలా టైమ్ పడుతుందని అందువల్ల వీలయినంత త్వరగా సింగిల్ పార్ట్ కిందే ఫినిష్ చేయాలని కోరినట్లు తెలుస్తోంది.

ఈ నెల 15 నుంచి ఆర్ఆర్ఆర్ షూటింగ్ మళ్లీ ప్రారంభం అవుతుంది.  అయితే ఎన్టీఆర్-చరణ్ ఎప్పుడు షూట్ కు జాయిన్ అవుతారో ఇంకా తెలియదు. మరో పక్కన ఎన్టీఆర్ కు త్రివిక్రమ్ సినిమా, చరణ్ కు ఆచార్య సినిమాలు వెంట తరుముతున్నాయి. వీలయినంత త్వరగా వాటి మీదకు వెళ్లాల్సి వుంది.

ఏమో? పవన్ గేమ్స్ ఎవరికీ అర్థం కావు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?