‘భీష్మ’తో ఘన విజయాన్ని అందుకున్న నితిన్ అదే ఊపులో ‘రంగ్ దే’తో మరో విజయాన్ని అందుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాడు. అయితే కరోనా కల్లోలం వల్ల ఆ చిత్రం షూటింగ్ డిలే అయింది. ఈ విపత్తు వల్ల నితిన్ పెళ్లి కూడా వాయిదా పడింది. ‘రంగ్ దే’ షూటింగ్ పూర్తి చేసేసి పెళ్లి పనులతో బిజీ అవుదామని అనుకున్న నితిన్కి ఇప్పుడు అనుకోని అవాంతరం వచ్చి పడింది.
‘రంగ్ దే’ చిత్రానికి యూరప్ నేపథ్యం ఎంచుకున్నారు. యూరప్లో చిత్రీకరించాల్సిన భాగం మినహా మిగతాదంతా ఇండియాలో షూటింగ్ చేసారు. యూరప్ నేపథ్యానికి తగ్గట్టుగా ఇక్కడే సెట్ వేసి కొన్ని సీన్లు కూడా తీసేసారు. అయితే ఇప్పుడు యూరప్లో తీయాల్సిన సీన్లు ఏ దేశంలో తీయాల్సి వస్తుందనేది సితార ఎంటర్టైన్మెంట్స్కి అంతు చిక్కడం లేదు.
కరోనా కారణంగా యూరప్ అతలాకుతలం కావడంతో ఇప్పట్లో అక్కడికి విదేశీయుని రానివ్వకపోవచ్చు. అలాగే యూరప్ వెళితే ప్రశాంతంగా షూట్ చేసుకోవడానికి కూడా ఆస్కారముండదు. మరి దర్శకుడు వెంకీ అట్లూరి మరేదయినా నేపథ్యం ఎంచుకుంటాడా, లేక ఇలాగే మేనేజ్ చేయాని చూస్తాడా అనేది ఇంకా తెలీదు. మొత్తానికి కరోనా వైరస్ విపత్తు వల్ల ‘రంగ్ దే’ చిత్రానికి కొద్దిపాటి తలనొప్పు తప్పేట్టు లేవు.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు