Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

త్రివిక్రమ్ బంతి రాజమౌళి కోర్టులో

త్రివిక్రమ్ బంతి రాజమౌళి కోర్టులో

అల వైకుంఠపురములో సినిమా విడుదలై తొమ్మిది నెలలు అవుతోంది. వాస్తవానికి ఆరు నెలలు గ్యాప్ తీసుకుని, మరో సినిమా ప్రారంభించినా రాబోయే సంక్రాంతికి మరో సినిమా రెడీ అయిపోయి వుండేది.

కానీ కరోనా కల్లోలం కారణంగా అన్ని ప్లాన్ లు చెడిపోయినట్లే తివిక్రమ్ సినిమా కూడా ఆగిపోయింది. ఆ సినిమా మీదకు రావాల్సిన ఎన్టీఆర్ ఇంకా ఆర్ఆర్ఆర్ మీదనే వుండిపోయారు. 

ఎన్టీఆర్ రావాలి. సినిమా చేయాలి, ఇదంతా ఎప్పటికి జరిగేనో అన్నది జవాబు తెలియని ప్రశ్నగా మారిపోయింది. ఇలాంటి నేపథ్యంలో దర్శకుడు త్రివిక్రమ్-హీరో మహేష్-బ్యానర్ హారిక హాసినిల నడుమ సయోధ్య కుదిరింది. సినిమా చేసేందుకు దాదాపు అంతా ఓకె అయిపోయింది.  కానీ ఎలా? ఎప్పుడు అన్నదే సమస్య.

రాజమౌళి కనుక ఎన్టీఆర్ ను ఎప్పటికి ఆర్ఆర్ఆర్ మీద నుంచి రిలీవ్ చేస్తారు అన్నది క్లారిటీ రావాలి. అలాగే ఎన్టీఆర్ ను స్మూత్ గా ఒప్పించాలి. ఈ రెండూ జరిగితే జనవరి నుంచి మహేష్-త్రివిక్రమ్ సినిమా స్టార్ట్ అయిపోతుంది.

పరశురామ్ సినిమా ఓ షెడ్యూలు విదేశాల్లో చేసి వచ్చి, ఆపి, త్రివిక్రమ్ సినిమా స్టార్ట్ చేయాలన్నది ప్లాన్. ఈ దిశగా అన్ని వైపుల నుంచి పావులు కదుపుతున్నారు. 

రాజమౌళి కనుక మార్చి, ఏప్రియల్ వరకు ఎన్టీఆర్ ను రిలీవ్ చేయడం కుదరదు అంటే మహేష్ సినిమాకు చాన్స్ వస్తుంది. అప్పుడు కూడా స్మూత్ గా ఎన్టీఆర్ ఒప్పించాలి.

అది త్రివిక్రమ్ వైపు నుంచే జరగాలి. అటు రాజమౌళి వైపు నుంచి కూడా రికమెండ్ చేయిండానికి మహేష్ క్యాంప్ ట్రయ్ చేస్తోందని తెలుస్తోంది.

పిల్లలతో పిల్లాడిలా జగన్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?