విదేశీయులెవరైనా ఇండియా వస్తే తాజ్మహల్ను సందర్శించకుండా వెళ్లరు. ప్రపంచ ఏడు వింతల్లో ఒకటిగా ప్రసిద్ధిగాంచిన తాజ్మహల్ కట్టడాన్ని మళ్లీమళ్లీ చూడాలని ఎవరైనా ఆశిస్తారు. ఎందుకంటే ఆ కట్టడం ప్రేమకు చిహ్నం. ఇటీవల తాజ్మహల్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులతో పాటు ట్రంప్ కూతురు ఇవాంక దంపతులు కూడా సందర్శించి ముగ్దులయ్యారు.
అలాంటి తాజ్మహల్పై బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ సోదరి రంగోలి చందేల్ వివాదాస్పద ట్వీట్ చేశారు. దీంతో ఆమెపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. తాజ్మహల్ కేవలం సమాధి మాత్రమే అని, అది ఎప్పటికీ ‘ప్రేమ చిహ్నం’ కాదంటూ రంగోలి బుధవారం ట్వీట్ చేసి అనవసరంగా వివాదాన్ని కొని తెచ్చుకున్నారు. రంగోలి చందేల్ ట్వీట్పై సోషల్ మీడియాలో హాట్హాట్గా చర్చ నడుస్తోంది.
‘తాజ్ మహల్ను చాలా మంది సమాధిగానే పరిగణిస్తారు. అయితే దీన్ని ప్రపంచ వింతగా చూడాలని ప్రజలను బలవంతం చేస్తున్నారు. ముంతాజ్పై ఉన్న ప్రేమ, గౌరవంతో షాజాహాన్ నిర్మించిన ఈ అతిపెద్ద కట్టడం వెనుక ఒళ్ళు గగుర్పొడిచే విషయాలెన్నో ఉన్నాయి. ఆమెను షాజాహాన్ ఎంతగా హింసించేవాడో మీకు తెలుసా?’ అంటూ ట్వీట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ ట్వీట్పై నెటిజన్లు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. ఒకొక్కరు ఒక్కో రకంగా రంగోలి ట్వీట్పై ఫైర్ అవుతున్నారు.
తాజ్ మహల్ను ప్రేమకు చిహ్నంగా అంగీకరించాలని మిమల్ని ఎవరూ కోరడం లేదని ఒక నెటిజన్ వ్యాఖ్యానిస్తే, ఇది ప్రపంచలోని వింత అని చరిత్రే చెబుతోందని, ఇక మీ అభిప్రాయం ఎవరికి కావాలని మరో నెటిజన్ సీరియస్గా కామెంట్స్ చేశారు. రంగోలి అభిప్రాయంతో ఏకభవించే ఏ ఒక్క నెటిజన్ లేకపోవడం గమనార్హం.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు