Advertisement

Advertisement


Home > Movies - Movie News

సంతృప్తి ప‌ర‌చ‌ని దీపికా

సంతృప్తి ప‌ర‌చ‌ని దీపికా

డ్ర‌గ్స్ విచార‌ణ‌లో ప్ర‌ముఖ న‌టి దీపికా స‌మాధానాలు త‌మ‌ను సంతృప్తి ప‌ర‌చ‌లేద‌ని ఎన్సీబీ అధికారులు తెలిపారు. సుశాంత్ ఆత్మ‌హ‌త్య కేసులో విచార‌ణ చేప‌ట్టిన అధికారుల‌కు తీగ లాగితే డొంక క‌దిలిన చందంగా డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం వెలుగులోకి వ‌చ్చింది. 

ఇప్ప‌టికే సుశాంత్ ప్రియురాలు రియా చ‌క్ర‌వ‌ర్తిని ఎన్సీబీ అధికారులు విచారించి అరెస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. విచార‌ణ‌లో భాగంగా రియా వెల్ల‌డించిన వివ‌రాల ఆధారంగా మ‌రికొంద‌రిని ఎన్సీబీ విచారిస్తోంది.

బాలీవుడ్ హీరోయిన్లు ర‌కుల్‌, దీపికా, శ్ర‌ద్ధా, సారాల‌కు ఎన్సీబీ అధికారులు నోటీసులు ఇచ్చారు. నోటీసులు అందుకున్న రకుల్ నిన్న విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. నేడు దీపికా, శ్ర‌ద్ధా, సారా కూడా విచార‌ణ నిమిత్తం ఎన్సీబీ అధికారుల ముందుకు వ‌చ్చారు. మేనేజ‌ర్ క‌రిష్మా ప్ర‌కాశ్‌తో చాటింగ్‌, ఇత‌ర‌త్రా వివ‌రాల‌పై ఎన్సీబీ అధికారులు దీపికాను ప్ర‌శ్నించిన‌ట్టు స‌మాచారం. క‌రిష్మాతో త‌న‌కు డ్ర‌గ్స్ సంబంధాలు లేవ‌ని తేల్చి చెప్పిన‌ట్టు స‌మాచారం.

ఇదిలా ఉండ‌గా దీపికా సమాధానాలు త‌మ‌ను సంతృప్తి ప‌ర‌చ‌లేద‌ని ఎన్సీబీ అధికారులు వెల్ల‌డించారు. మ‌రోవైపు జ‌య‌సాహాతో చాటింగ్‌పై శ్ర‌ద్ధ‌ను ఎన్సీబీ అధికారులు ప్ర‌శ్నించిన‌ట్టు తెలిసింది. అయితే ఎన్సీబీ అధికారులు చేస్తున్న హ‌డావుడి బాలీవుడ్‌ను డ్ర‌గ్స్ నుంచి విముక్తి చేస్తుందా?  లేదా? అనే ప్ర‌శ్న‌లు ఎదుర‌వుతున్నాయి. 

నాకు జగన్ ఇచ్చిన గౌరవం అది

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?