Advertisement

Advertisement


Home > Movies - Movie News

రష్మిక ఇంటిపై ఐటీ దాడులు

రష్మిక ఇంటిపై ఐటీ దాడులు

హీరోయిన్ రష్మిక ఇంటిపై ఈరోజు ఆదాయపు పన్నుశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. కర్ణాటకలోని కొడుగు జిల్లా విరాజ్ పేట్ లో రష్మిక ఇల్లు, ఆమె తండ్రికి చెందిన పలు ఆస్తులపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఉదయం 7 గంటల 30 నిమిషాల ప్రాంతంలో 3 కార్లలో బెంగళూరు నుంచి వచ్చిన ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఈ తనిఖీల్ని కొనసాగిస్తున్నారు.

రష్మిక ఆస్తులపై ఆరా తీస్తున్నట్టు బెంగళూరు ఐటీ అధికారులు నిర్థారించారు. సోదాలు నిర్వహిస్తున్న టైమ్ లో రష్మిక ఇంట్లో లేదు. ఆమె ప్రస్తుతం ఓ సినిమా షూటింగ్ లో ఉన్నారు. రష్మిక బ్యాంక్ ఖాతాలతో పాటు ఆమె తండ్రికి సంబంధించిన స్థిర, చరాస్తి వివరాల్ని ఐటీ అధికారులు అడిగి తెలుసుకుంటున్నారు.

ప్రస్తుతం సౌత్ లో బిజీ హీరోయిన్ గా కొనసాగుతోంది రష్మిక. తాజాగా ఆమె నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా థియేటర్లలోకి వచ్చింది. భీష్మ సినిమా విడుదలకు సిద్ధమైంది. బన్నీతో త్వరలోనే ఆమె సెట్స్ పైకి వెళ్లబోతోంది. తమిళ్ లో కూడా ఓ సినిమా చేస్తోంది. ఇలాంటి టైమ్ లో ఆమెపై ఐటీ దాడులు జరగడం కలకలం రేపింది.

సినీప్రముఖలు, సెలబ్రిటీల ఇళ్లపై ఈమధ్య కాలంలో  మినిమం గ్యాప్స్ లో దాడులు నిర్వహిస్తున్నారు ఐటీ అధికారులు. ఇంతకుముందు నటి లావణ్య త్రిపాఠి, అనసూయ, సుమ ఇళ్లపై దాడులు నిర్వహించారు. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి రష్మిక కూడా చేరింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?