సీనియర్ హీరోయిన్, కాంగ్రెస్ నేత నగ్మాకు తీవ్ర ఆగ్రహం వచ్చింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ)పై ఆమె తన కోపాన్ని ప్రదర్శించింది. ఒక్కొక్కరికి ఒక్కో విధమైన న్యాయాన్ని ఎన్సీబీ పాటిస్తోందనేది ఆమె మండిపాటుకు ప్రధాన కారణం. డ్రగ్స్ తీసుకున్నట్టు గతంలో ప్రకటించిన బాలీవుడ్ వివాదాస్పద నటి కంగనా రనౌత్కు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎందుకు నోటీసులు పంపలేదని ఆమె ట్విటర్ వేదికగా నిలదీస్తున్నారు.
ప్రముఖ హీరోయిన్లు దీపికా పదుకొనే, సారా అలీ ఖాన్, శ్రద్ధాకపూర్, రకుల్ ప్రీత్ సింగ్లకు ఎన్సీబీ సమన్లు అందించిన నేపథ్యంలో నగ్మా ట్వీట్ వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా నగ్మా ట్వీట్ ఏంటో చూద్దాం.
"గతంలో తాను డ్రగ్స్ తీసుకున్నట్టు కంగనా రనౌత్ ప్రకటించింది. అలాంటప్పుడు కంగనాకు ఎన్సీబీ ఎందుకు సమన్లు పంపలేదు. వాట్సాప్ చాట్ ఆధారంగానే మిగిలిన హీరోయిన్లను పిలిచారు కదా! మరి, స్వయంగా తనకు తానుగా పేరు వెల్లడించిన కంగనను ఎందుకు పిలవలేదు? అంతేకాదు, టాప్ హీరోయిన్స్కు సంబంధించిన సమాచారాన్ని మీడియాకు లీక్ చేసి వారి ఇమేజ్ను డ్యామేజ్ చేయడమే ఎన్సీబీ డ్యూటీనా" అని నగ్మా తీవ్రస్థాయిలో ప్రశ్నించారు. నగ్మా ట్వీట్పై ఎన్సీబీ, కంగనా ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు