Advertisement

Advertisement


Home > Movies - Movie News

వెండితెరపై నగ్నంగా ప్రభాస్ హీరోయిన్

వెండితెరపై నగ్నంగా ప్రభాస్ హీరోయిన్

ప్రభాస్ సరసన సాహో సినిమాలో నటించిన శ్రద్ధా కపూర్, ఓ డేరింగ్ డెసిషన్ తీసుకుంది. సిల్వర్ స్క్రీన్ పై నగ్నంగా కనిపించేందుకు రెడీ అవుతోంది. అది కూడా ఓ రీమేక్ సినిమాతో.

తమిళ్ లో అమలాపాల్ నటించిన ఆడై (తెలుగులో ఆమె అనే టైటిల్ తో రిలీజైంది) సినిమాను హిందీలో రీమేక్ చేయాలని నిర్ణయించారు. ఈ రీమేక్ లో నటించడానికి శ్రద్ధాకపూర్, సూత్రప్రాయంగా అంగీకరించింది.

"ఆమె" సినిమాలో అమలాపాల్ పూర్తి నగ్నంగా నటించింది. అప్పట్లో ఆమె తీసుకున్న ఈ బోల్డ్ నిర్ణయాన్ని అంతా మెచ్చుకున్నారు కూడా. ఇప్పుడు ఆ పాత్రలో హిందీలో శ్రద్ధాకపూర్ చేయబోతోంది. ఒరిజినల్ సినిమాను తెరకెక్కించిన రత్నకుమార్, హిందీ వెర్షన్ ను కూడా డైరక్ట్ చేయబోతున్నాడు.

నిజానికి ఈ సినిమా రీమేక్ లో కంగనా రనౌత్ నటించబోతోందంటూ గతంలోనే వార్తలు వచ్చాయి. అయితే వీటిని ఆ మూవీ ప్రొడ్యూసర్ సుబ్రమణియన్ ఖండించాడు. ఇప్పుడీ ప్రాజెక్ట్ శ్రద్ధాకపూర్ చేతిలోకి వెళ్లింది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?