Advertisement

Advertisement


Home > Movies - Movie News

త‌న ఇష్టాన్ని బ‌య‌ట పెట్టిన శ్రుతీహాస‌న్

త‌న ఇష్టాన్ని బ‌య‌ట పెట్టిన శ్రుతీహాస‌న్

ప్ర‌తి మ‌నిషికీ ఒక్కో ర‌క‌మైన ఇష్టాలుంటాయి. వాళ్లు పెరిగిన వాతావ‌ర‌ణం, అభ్య‌సించిన చ‌దువు, ఇత‌ర‌త్రా అనేక ప్ర‌భావాలు మ‌నిషి ఇష్టాయిష్టాల‌పై ప్ర‌భావం చూపుతాయి. కొంత మంది ఇష్టాలు , మ‌రి కొంద‌రికి న‌చ్చ‌క‌పోవ‌చ్చు. కానీ ఎదుటి వాళ్ల ఇష్టాల‌ను, ఆయిష్టాల‌ను గౌర‌వించిన‌ప్పుడే ఆరోగ్య‌క‌ర‌మైన స్నేహ‌పూర్వ‌క సంబంధాలు కొన‌సాగ‌డానికి అవ‌కాశం ఉంటుంది.

విశ్వ న‌టుడు క‌మ‌ల్‌హాస‌న్ కుమార్తె, ప్ర‌ముఖ హీరోయిన్ శ్రుతీహాస‌న్ త‌న మ‌నోగ‌తాన్ని నిర్భ‌యంగా బ‌య‌ట పెట్టుకోవ‌డంలో ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్ అవుతుంటారు. లాక్‌డౌన్ స‌మ‌యంలో కాస్త తీరిక దొర‌క‌డంతో సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌తో అనేక విష‌యాల‌ను ఆమె షేర్ చేసుకున్నారు. ప్ర‌స్తుతం కూడా ఆమె అదే ప‌ని చేస్తున్నారు.

శ్రుతీ న‌టించిన లాభం అనే త‌మిళ చిత్రం త్వ‌ర‌లో విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలో ఆమె సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న ఇష్టాల గురించి ఆమె చెప్పుకొచ్చారు.

చెన్నై ఎప్పుడొచ్చినా నాన్న (క‌మ‌ల్‌హాస‌న్‌)ను క‌లుసుకుంటాన‌న్నారు. ఆ త‌ర్వాత ఒంట‌రి జీవితాన్ని గడుపుతాన‌న్నారు. వంట‌, ఇంటి ప‌ని, బ‌ట్ట‌లు ఉత‌క‌డం లాంటి ప‌నుల్నీ తానే చేసుకుంటాన‌ని ఆమె వెల్ల‌డించారు. అన్నిటికీ మించి త‌న‌కు ఒంట‌రిత‌నం అంటే ఎంతో ఇష్ట‌మ‌ని శ్రుతీ స్ప‌ష్టం చేశారు. లాక్‌డౌన్‌లో ఇంట్లోనే ఒంట‌రిగా గ‌డుపుతున్నా ఎప్పుడూ బోర్ కొట్ట‌లేద‌న్నారు. ఎందుకంటే ఇష్ట‌మైన ప‌నులు చేయ‌డంలో ఎప్పుడూ నిరాశ నిస్పృహ‌లు ద‌గ్గ‌రికి రావ‌న్నారు.  

బాబు వందల గుళ్లు కూల్చేసినా ఓకేనా

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?