Advertisement

Advertisement


Home > Movies - Movie News

సాయిప‌ల్ల‌వి గురించి ఎవ‌రికీ తెలియ‌ని సంచ‌ల‌న‌ విష‌యాలివే...

 సాయిప‌ల్ల‌వి గురించి ఎవ‌రికీ తెలియ‌ని సంచ‌ల‌న‌ విష‌యాలివే...

హీరోయిన్ సాయిప‌ల్ల‌వి...ఫిదా సినిమాలో త‌న న‌ట‌న‌తో అంద‌రినీ ‘ఫిదా’ చేసింది. ఇటూ అటూ గెంతుతూ చ‌లాకీ పిల్ల‌గా క‌నిపించే ఆమె...‘ఏంది ముద్దు పెడితే ఏడుస్తారాబ్బా’ అంటూ ‘ల‌వ్‌స్టోరీ’లో ఓ డైలాగ్‌తో మ‌రోసారి సాయిప‌ల్ల‌వి పాపుల‌ర్ హీరోయిన్‌గా మ‌న ముందుకొస్తోంది. నాగ‌చైత‌న్య‌తో క‌ల‌సి  ప్రేమ‌లో త‌డిసి ముద్దై , ప్రేక్ష‌కుల మ‌న‌సుల్లో త‌డిని నింపే ఆ త‌మిళ భామ త‌న వ్య‌క్తిగ‌త‌, వృత్తిగ‌త విశేషాల‌ను వెల్ల‌డించింది. అంతేకాదు, ఇంత వ‌ర‌కూ ఎవ‌రికీ తెలియ‌ని విష‌యాల‌ను కూడా అభిమానుల కోసం చెప్పింది.

తాను డాక్ట‌ర్‌ను కాబోయి తృటిలో త‌ప్పించుకుని యాక్ట‌ర్‌ను అయిన‌ట్టు సాయిప‌ల్ల‌వి స‌ర‌దాగా చెప్పింది. ఎంబీబీఎస్ త‌ర్వాత కార్డియాల‌జీ చ‌దివి...ఆ త‌ర్వాత హృద్రోగుల‌కు చికిత్స చేస్తూ గ‌డ‌పాల‌ని అనుకున్న‌ట్టు తెలిపింది.

అయితే ఊహించ‌ని విధంగా సినిమాల్లోకి వ‌చ్చిన‌ట్టు ఆమె చెప్పింది. చిన్న‌ప్పుడు తాను మాధురీదీక్షిత్‌, ఐశ్వ‌ర్య‌రాయ్‌ల‌ను చూసి డ్యాన్స్ నేర్చుకున్నాన‌ని ఆమె గుర్తు చేసుకొంది. అంతేకాదు,  చిన్న‌ప్పుడు  చ‌దువుకున్న కోయంబ‌త్తూర్ అంటే త‌న‌కెంతో ఇష్ట‌మ‌ని, షూటింగ్‌లు లేక‌పోతే అక్క‌డికే వెళ్లిపోతాన‌ని కూడా ఆమె వెల్ల‌డించింది. ఎందుకంటే ఆ వాతావ‌ర‌ణానికి తానెంత‌గానో క‌నెక్ట్ అయ్యాన‌ని సాయి ప‌ల్ల‌వి వివ‌రించింది.

కాలేజ్ డేస్ నుంచి త‌న‌కు హీరో సూర్య అంటే పిచ్చి అభిమానం అని చెప్పుకొచ్చింది. ఎన్జీకేలో ఆయ‌న‌తో క‌లిసి న‌టించ‌డం అదృష్టంగా భావిస్తున్న‌ట్టు ఆమె చెప్పింది. అదే విధంగా ఎన్జీకే షూటింగ్ అనుభ‌వాల‌ను కూడా ఆమె ఆస‌క్తిక‌రంగా చెప్పింది. ఎన్జీకే స‌మ‌యంలో చేసిన సీన్‌నే ప‌దేప‌దే ద‌ర్శ‌కుడు రీషూట్ చేశారని ఆమె చెప్పింది. దీంతో ఒక‌రోజు సినీరంగాన్ని వ‌దిలేస్తాన‌ని అమ్మకు చెప్పి ఏడ్చేశాన‌ని,  ఆ త‌ర్వాత ద‌ర్శ‌కుడు ప‌ర్‌ఫెక్ష‌న్ గురించి చెప్ప‌డంతో పాజిటీవ్‌గా తీసుకున్న‌ట్టు సాయిప‌ల్ల‌వి వివ‌రించింది.

అలాగే సినిమా కోసం తానెంత క‌ష్ట‌ప‌డుతానో ఆమె వివ‌రించింది. ఫిదా కోసం ట్రాక్ట‌ర్ న‌డ‌ప‌డం నేర్చుకున్నాన‌ని, కానీ మాగాణిలో ట్రాక్ట‌ర్ న‌డ‌ప‌డం చాలా క‌ష్ట‌మ‌ని ఆమె వివ‌రించింది.

ఇక త‌న పెళ్లి విష‌యాల‌ను కూడా ఆమె మాట్లాడింది. ఫిదాలో వ‌రుణ్ లాంటి అబ్బాయి క‌నిపిస్తే వెంట‌నే ‘ఐ ల‌వ్యూ చెప్పేస్తా’ అని ఆమె స‌ర‌దాగా చెప్పుకొచ్చింది.

ఇక చివ‌ర‌గా త‌న గురించి ఎవ‌రికీ తెలియ‌ని విష‌యాల‌ను కూడా ఆమె వెల్ల‌డించింది. త‌న‌ది త‌మిళ‌నాడులోని ‘బ‌డుగ’ అనే గిరిజ తెగ అని ఏ మాత్రం దాచుకోకుండా చెప్పిందామె. అంతే కాదు, త‌న మాతృభాష అయిన ‘బ‌డుగ’కు లిపి కూడా లేద‌ని ఆమె వివ‌రించింది. నిజంగా సాయిప‌ల్ల‌వికి సంబంధించిన ఈ వ్య‌క్తిగ‌త విష‌యాలు చాలా ఆస‌క్తిక‌రంగా ఉన్నాయి.

మేము సైతం

ఆంధ్రప్రదేశ్‌లో లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమ‌లు చేస్తాం

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?