బుల్లితెర గ్లామర్ క్వీన్ అనసూయ భయపడుతున్నారా? అంటే ఔననే సమాధానం వస్తోంది. త్వరలో కోలీవుడ్లో తెరకెక్కనున్న సిల్క్స్మిత బయోపిక్లో అనసూయ లీడ్రోల్ చేస్తున్నారనే ప్రచారం ఇటీవల విస్తృతంగా సాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఆ ప్రచారంపై అనసూయ ట్విటర్ వేదికగా స్పందించారు.
సిల్క్స్మిత బయోపిక్లో తాను నటించడం లేదని తేల్చి చెప్పారు. అయితే ఈ ప్రచారానికి బీజం వేసింది అనసూయే. ఓ కొత్త సినిమాతో కోలీవుడ్లో అడుగుపెట్టబోతున్నట్టు స్వయంగా అనసూయే ఇటీవల ప్రకటించారు.
ఈ సందర్భంగా మరో మంచి కథ.. కొత్త ఆరంభం, కోలీవుడ్ అనే క్యాప్షన్తో అద్దంలో తన ముఖాన్ని చూసుకుంటున్న బ్లాక్ అండ్ వైట్ ఫొటోను సోషల్ మీడియాలో అనసూయ షేర్ చేశారు.
ఆ ఫొటోకు రిఫరెన్స్ సిల్క్ స్మితగారు అని ఆమె పేరును ట్యాగ్ చేశారు. దీంతో కోలీవుడ్లో తెరకెక్కుతున్న సిల్క్స్మిత బయోపిక్లో అనసూయ లీడ్రోల్ చేస్తున్నారనే ప్రచారానికి బలం చేకూర్చినట్టైంది.
సహజంగా నటీనటులపై రకరకాల ప్రచారాలు మీడియాలో జరుగుతుంటాయి. వాటిలో నిజం లేకపోతే నటీనటులు పెద్దగా పట్టించుకోరు. అలాంటిది అనసూయ ప్రత్యేకంగా సిల్క్స్మిత బయోపిక్ విషయమై ట్వీట్ చేశారంటే ….తానెంత సీరియస్గా ఆలోచిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
ముఖ్యంగా అలా ప్రచారం జరగడం వల్ల తనపై నెగిటివ్ ముద్ర పడే ప్రమాదం ఉందని ఆమె ట్వీట్ చేయడాన్ని అర్థం చేసుకోవచ్చని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఎందుకంటే సిల్క్స్మిత రీల్ లైఫ్లో పోషించిన పాత్రల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బావలు సయ్యా అంటే సైసై అని సిల్క్స్మితను ప్రేక్షకులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. అలాగే రియల్ లైఫ్లో కూడా ఒడిదుడుకులతో సాగింది. చివరికి ఆమె జీవితం విషాదాంతమైంది.
అందుకే చేయని క్యారెక్టర్ వల్ల అనవసరంగా తనను సిల్క్స్మితతో పోల్చి, ఇండస్ట్రీలో ఆ పేరుతో నెగిటివ్ ముద్ర వేస్తారనే భయం ఆమెలో కనిపిస్తోంది. అంతేగా మరి!