Advertisement

Advertisement


Home > Movies - Movie News

అనసూయ దుమ్ము రేపిందిగా

అనసూయ దుమ్ము రేపిందిగా

సరైన నటి కాస్త వ్యాంప్ టచ్ ఇచ్చి, చిందులు వేస్తే ఆ కిక్కేవేరు. అనుష్క (వేదం), తమన్నా (జై లవకుశ) పూజా హెగ్డే (రంగస్థలం) ఇలా ఇంకా చాలా మంది ఇలా దుమ్ము రేపారు. ఇప్పుడు ఈ లీగ్ లో చేరిపోయేలా వుంది యాంకర్ కమ్ యాక్టర్ అనసూయ.

గీతా2 సంస్థ కార్తికేయ-లావణ్య త్రిపాఠీ కాంబినేషన్లో నిర్మించే 'చావు కబురు చల్లగా' సినిమాలో అనసూయ ఐటమ్ చిందులు వేసింది. ఈ పాట శాంపిల్ ను ఈ రోజు వదిలారు. జానీ మాస్టార్ కంపోజిషన్ లో అనసూయ చిందులు మామూలుగా లేవు.

పైన పటారం లోన లొటారం అని పాడుతూ, దానికి సింబాలిక్ మూవ్ మెంట్స్ ఇస్తూ, కుర్రకారును థియేటర్లకు లాక్కు రావడానికి కీ పాయింట్ అయ్యేలా కనిపించింది. 

గీతా  లాంటి సంస్థ అడగడం, స్నేహితుడైన జానీ మాస్టర్ డ్యాన్స్ డైరక్షన్ కావడంతో ఓకె అన్నాను తప్ప, మళ్లీ మళ్లీ ఇలాంటి పాటలు చేసే ఉద్దేశం లేదని అనసూయ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేసింది.

కానీ ఈ పాట విడుదలైన తరువాత వచ్చే క్రేజ్, ఆపర్లు కలిసి అనసూయ మరోసారి ఇలాంటి పాటల వైపు నడిపించకుండా వుంటాయా? అన్నది అనుమానం. మొత్తానికి వెయిటింగ్ ఫర్ ఫుల్ విడియో..

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?