Advertisement

Advertisement


Home > Movies - Movie News

బాలయ్య డైరక్ట్ చేసిన సినిమా విడుదలకు సిద్ధం

బాలయ్య డైరక్ట్ చేసిన సినిమా విడుదలకు సిద్ధం

మొన్ననే లాక్ డౌన్ టైమ్ లో ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు బాలయ్య. తన సినిమాలు, కెరీర్ గురించి మాట్లాడుతూ.. నర్తనశాల సినిమాను తన డ్రీమ్ ప్రాజెక్టుగా చెప్పుకొచ్చారు. ఎప్పటికైనా దాన్ని పూర్తిచేస్తానని శపథం చేసినట్టు మాట్లాడారు. అయితే ఎక్కువగా సెంటిమెంట్లు ఫాలో అయ్యే ఈ నటుడు.. అదే నెగెటివ్ సెంటిమెంట్ తో నర్తనశాలను కొన్నేళ్లుగా పక్కనపెట్టేశారు. ఇన్నేళ్లకు బాలయ్య ఆ ప్రాజెక్టును వదిలించుకున్నారు.

అవును.. నర్తనశాల సినిమాకు సంబంధించి గతంలో బాలయ్య తెరకెక్కించిన సన్నివేశాల్ని ఎడిట్ చేసి, ఎంత వస్తే అంత నిడివి దృశ్యాల్ని ఇప్పుడు విడుదల చేయబోతున్నారు. స్వీయ దర్శకత్వంలో బాలయ్య నటిస్తూ తెరకెక్కించిన ఈ సినిమా సన్నివేశాలు ఎడిటింగ్ చేస్తే 17 నిమిషాలు వచ్చాయి.

ఆ 17 నిమిషాల దృశ్యాల్ని దసరా సందర్భంగా 24వ తేదీన ఏటీటీలో విడుదల చేయాలని నిర్ణయించారు. శ్రేయాస్ ఈటీ ద్వారా ఎన్ బీ కే థియేటర్ లోకి వెళ్లి కొంత మొత్తం చెల్లించి ఈ 17 నిమిషాల దృశ్యాల్ని చూడొచ్చు. అయితే ఈ వీడియో చూడ్డానికి ఎంత మొత్తం నిర్ణయించారనేది ఇంకా బయటకు రాలేదు. కానీ వచ్చిన మొత్తంలో కొంత భాగాన్ని ఛారిటీకి ఇవ్వడానికి మాత్రం ఒప్పుకున్నారు బాలయ్య.

నర్తనశాల సినిమా మొదలైన కొన్ని రోజులకే యాక్సిడెంట్ లో హీరోయిన్ సౌందర్య మృతిచెందింది. అప్పట్నుంచి ఆ సినిమా అలా ఆగిపోయింది. ఆ తర్వాత కొన్నేళ్లకు శ్రీహరి కూడా మరణించారు. ఈ సినిమాలో అర్జునుడిగా బాలయ్య, ద్రౌపదిగా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్ బాబు నటించారు.

పాపం, ఆర్కేని ఎలా మోసం చేయాలనిపించింది

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?