Advertisement

Advertisement


Home > Movies - Movie News

సెలబ్రిటీస్‌కి దూరంగా బిగ్‌బాస్!

సెలబ్రిటీస్‌కి దూరంగా బిగ్‌బాస్!

బిగ్‌బాస్ షోలో ఇంతకుముందు పాపులర్ కంటెస్టెంట్స్ కంపల్సరీగా వుండాలని భావించేవాళ్లు. ఆడియన్స్ షో ఆసక్తిగా చూడడానికి అయినా శ్రీముఖి, తేజస్వి, గీతామాధురి లాంటి వాళ్లు వుండాలని అనుకుని వారికి అధిక పారితోషికం కూడా ఇచ్చేవాళ్లు. అది కాకుండా వారిని ఫైనల్ వీక్ వరకు వుంచడానికి చాలా పాట్లు పడేవాళ్లు. 

కరోనా కారణంగా ఈ సీజన్‌కి పాపులర్ కంటెస్టెంట్లు దొరకలేదు. దాంతో సోషల్ మీడియాలో తెలిసిన ముఖాలు, చిన్నా చితకా టీవీ నటులను తీసుకొచ్చి షో నడిపిస్తున్నారు. దీని వల్ల ఈ సీజన్ అంచనాలకు భిన్నంగా నడుస్తోంది. సెలబ్రిటీలు హౌస్‌లో వుంటే వాళ్లు చివరి వరకు ఎలిమినేట్ అవరనేది ఆడియన్స్ ఊహిస్తారు కనుక సస్పెన్స్ వుండదు. 

అలాగే అంతగా తెలియని వాళ్లు షోలో వున్నపుడు వారిని కంపల్సరీగా కాపాడుకోవాల్సిన తలనొప్పి కూడా బిగ్‌బాస్ డైరెక్టర్లకు వుండదు. ప్రేక్షకులు ఒకే కంటెస్టెంట్‌కి కట్టుబడిపోకుండా ఎప్పటికప్పుడు తమ ఇష్టాలు మార్చేసుకుంటూ పర్‌ఫార్మెన్స్ ఆధారంగా ఫేవరెట్స్‌ని ఎంచుకుంటారు. దీని వల్ల షో పట్ల ఆసక్తి బాగా పెరగడంతో వచ్చే సీజన్లో కూడా టాప్ సెలబ్రిటీలు లేకుండా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్‌ని హౌస్‌లోకి పంపించాలని చూస్తున్నారట. ఒకవేళ పాపులర్ సెలబ్రిటీలు ఎవరైనా వచ్చినా కానీ వాళ్లకు ఎలాగైనా చివరి వరకు వుంచుతామనే కమిట్‌మెంట్లు ఏమీ పెట్టుకోరట.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?