కరోనా క్రైసిస్ ముగిసిన తర్వాత సినిమా మార్కెట్ ఎలా వుంటుందనే దానిపై నిర్మాతలకు ఎలాంటి ఐడియా లేదు. మార్కెట్ స్థితిగతులు తెలుసుకోకుండా భారీ బడ్జెట్ చిత్రాలతో ముందుకెళ్లడానికి చాలా మంది నిర్మాతలు వెనకాడుతున్నారు.
ముఖ్యంగా మిడ్ రేంజ్ సినిమాలపై మామూలుగా కంటే ఎక్కువ ఖర్చు పెట్టేందుకు సీనియర్ ప్రొడ్యూసర్స్ ఇష్టపడడం లేదు.
ఇదే కారణం మీద నాని సినిమా చేతులు మారిందని ఫిలింనగర్లో చెప్పుకుంటున్నారు. ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రాన్ని కరోనా క్రైసిస్కి ముందు సితార ఎంటర్టైన్మెంట్స్లో అనౌన్స్ చేసారు. డిసెంబర్ 25న విడుదల చేస్తామని కూడా ప్రకటించారు.
కానీ లాక్డౌన్లో అన్నీ తారుమారయ్యాయి. ఈ చిత్రానికి బడ్జెట్ ఎక్కువ కనుక ఈ టైమ్లో రిస్క్ అని నిర్మాత వెనక్కి తగ్గినట్టు సమాచారం.
దీంతో ఆ కథపై నమ్మకంతో నాని అదే సినిమాను మరో నిర్మాత చేతుల్లో పెట్టాడట. టాక్సీవాలా దర్శకుడికి ఇంత పెద్ద బడ్జెట్ సినిమా హ్యాండిల్ చేసిన అనుభవం లేకపోయినా కానీ వైవిధ్యభరిత కథాంశంతో రూపొందే ఈ చిత్రం తన బ్యాడ్ రన్కి బ్రేక్ వేస్తుందని నాని కాన్ఫిడెంట్గా వున్నాడట.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు