ఇప్పటి వరకూ ఈ ఏడాది ఆస్కార్స్ కు లిస్ట్ అయిన రెండు వందల పై చిలుకు సినిమాల్లో ఒకటిగా నిలుస్తోంది తమిళ సినిమా జై భీమ్. తదుపరి వడపోత దాదాపు పూర్తయినట్టుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన బ్యాలెట్ల కౌంటింగ్ కూడా పూర్తయినట్టుగా సమాచారం. రిజల్ట్స్ సీల్డ్ కవర్లో ఉన్నాయి. వెల్లడి కావడమే తరువాయి. అది కూడా మరి కొన్ని గంటల్లోనే ఈ యేటి ఆస్కార్ నామినేషన్స్ వెల్లడికాబోతున్నాయి.
ఈ నేపథ్యంలో జై భీమ్ బెస్ట్ ఫారెన్ ఫిల్మ్ కేటగిరిలో ఆస్కార్ టాప్ లిస్టులో నిలుస్తుందా లేదా అనేది సర్వత్రా ఆసక్తి రేపుతున్న అంశం. హాలీవుడ్ సినీ మీడియా నుంచి వస్తున్న విశ్లేషణల్లో కూడా ఇప్పుడు జై భీమ్ హాట్ టాపిక్ గా మారింది. ఈ సారి ఫారెన్ ఫిల్మ్ కేటగిరిలో బెస్ట్ ఫిల్మ్ గా ఆస్కార్ ను దక్కించుకునేది జై భీమ్ అని అమెరికా నుంచినే ట్వీట్లు వస్తున్నాయి.
మరి ఈ సారి జై భీమ్ తదుపరి జాబితాలో స్థానం సంపాదించినా అది ప్రత్యేక ఘనతే అవుతుంది. చివరి సారిగా 2001లో వచ్చిన లగాన్ ఇండియా తరఫు నుంచి ఆస్కార్స్ నామినేషన్ పొందింది. ఆ తర్వాత ప్రతి ఏడాదీ ఇండియా పలు సినిమాలను పంపిస్తూనే ఉన్నా.. ఏదీ నామినేషన్ పొందలేదు. లగాన్ చివరి వరకూ పోరాడి తిరుగుముఖం పట్టింది.
ఆ తర్వాత ఇప్పుడు జై భీమ్ కు అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ సినిమా ఆస్కార్ విజయానికి అర్హమైనదని ట్విటర్లో వ్యాఖ్యలు అనంతంగా కనిపిస్తూ ఉన్నాయి. మరి జై భీమ్ పోరాటం ఎంత వరకూ అనేది మరి కొన్ని గంటల్లోనే తేలిపోనుంది.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు