మెగాస్టార్ చిరంజీవిపై ఓ నిర్మాత ‘నిప్పులు’ చెరిగాడు. తమ సంసారంలో ‘నిప్పులు’ పోయొద్దు అంటూ ఆ నిర్మాత వేడుకుంటున్నాడు. ఇంతకూ చిరుపై నిప్పులు చెరిగిన ఆ నిర్మాత ఎవరో నెటిజన్లకు బాగా తెలుసు. ఎందుకంటే ఆ నిర్మాత చేసిన ట్వీట్...బాగా వైరల్ అవుతోంది కాబట్టి. చిరుపై సరాదాగా చిటపటలాడిన ఆ నిర్మాతే పీవీపీ. మెగాస్టార్పై అంతేసి మాటలంటూ ట్వీట్ చేయడానికి గల కారణాలేంటో తెలుసుకుందాం.
లాక్డౌన్ వేళ సామాన్యులు, సెలబ్రిటీలనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఇళ్లకే పరిమితమైన విషయం తెలిసిందే. ఇళ్లలో ఉంటూ కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తున్న సెలబ్రిటీలు....అందుకు తగ్గ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ‘అర్జున్ రెడ్డి’ డైరెక్టర్ సందీప్ వంగా కాస్త డిపరెంట్గా థింక్ చేశాడు. ఇంట్లోని మహిళలతో ఇంటి పనులు చేయించకండి అంటూ ‘బీ ద రియల్ మేన్’ అనే నినాదంతో మగవారికి ఛాలెంజ్ విసిరాడు.
ఈ ఛాలెంజ్ను సినీ సెలబ్రిటీలు స్వీకరించి ఇంటి పనులు చేస్తున్న వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు.
ఇందులో భాగంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ విసిరిన ఈ ఛాలెంజ్ను మెగాస్టార్ చిరంజీవి స్వీకరించడమే కాదు...అందరి దృష్టి తనవైపు తిప్పుకునేలా అదరగొట్టి చూపించారు. ఇంట్లోని పనులు చేస్తున్న వీడియోని పోస్ట్ చేసిన చిరంజీవి ఈ ఛాలెంజ్కు కేటీఆర్, రజినీకాంత్, మణిరత్నం వంటి సినీ, రాజకీయ ప్రముఖలకు నామినేట్ చేశారు.
అయితే చిరు దోశ వేసిన తీరు, దాని రుచిపై సోషల్ మీడియాలో విస్తృతమైన ప్రచారం జరుగుతోంది. ఈ దోశ చేయడంపై నిర్మాత పీవీపీ సరదా ట్వీట్ వైరల్ అవుతోంది. ఇలా చేసి తమ సంసారంలో నిప్పులు పోయవద్దు అంటూ పీవీపీ ఆసక్తికర ట్వీట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది. పీవీపీ పూర్తి ట్వీట్ను పరిశీలిద్దాం.
‘చిరంజీవి గారు, ఏదో ఇంట్లో అంట్లు తోమగలం, గచ్చు కడగగలం కానీ మీరిలా స్టార్ చెఫ్ లా నలభీమ పాకం వండుతుంటే, మా ఆవిడ మెగాస్టారే చేయగలేనిది, మీకేమిటి అంటున్నారు. మా సంసారంలో నిప్పులు పోయొద్దు రియల్ లైఫ్ మెగాస్టార్గారు. జోక్స్ పక్కన పెడితే.. మీ నిరంతర ప్రేరణ ప్రశంసనీయం సర్’ అంటూ పీవీపీ తన ట్వీట్లో పేర్కొన్నారు. మొత్తానికి షూటింగ్లు బంద్ అయినా ఏదో ఒక రూపంలో సినీ ప్రియులకు మాత్రం కావాల్సిన ఎంటర్టైన్ ఇస్తూనే ఉన్నారు.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు