బిగ్బాస్ రియాల్టీ షోలో టీవీ9 దేవి చెలరేగిపోయారు. మనసులో ఉన్నదంతా బయటికి వెళ్లగక్కారు. బిగ్బాస్ హౌస్లో దేవి మిగిలిన కంటెస్టెంట్లతో పోల్చితే కొంత ప్రత్యేకమనే చెప్పాలి. వృత్తిరీత్యా జర్నలిస్టు అయిన దేవి ... తన స్వభావానికి విరుద్ధంగా బిగ్బాస్లో ఉండలేకపోతోంది.
అంటే కృత్రిమ నవ్వులు, ఏడ్పులు, అరవడాలు, అల్లరి చేయడాలు లాంటి వాటికి దేవి దూరంగా ఉండడం స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే సందర్భంలో అలాంటి చేష్టలను కుండబద్దలు కొట్టినట్టు వ్యతిరేకించడాన్ని నిన్నటి షోలో చూశాం.
హౌస్లో కంటెస్టెంట్ల నటనపై దేవి ఫైర్ అవుతుంటే .... ఒక దశలో హోస్ట్ నాగార్జున కూడా ఆశ్చర్యపోతూ చూస్తుండిపోయారు. మరోవైపు దేవి తనపై హౌస్లో ఏదో కుట్ర జరుగుతోందనే బలమైన అభిప్రాయంలో ఉన్నారని ఆమె మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు.
బిగ్బాస్ హౌస్లో హీరో, జీరోలెవరో చెప్పాలని కంటెస్టెంట్లకు హోస్ట్ నాగార్జున పెట్టిన పరీక్షలో ... ఎవరి మనసులో ఏముందో బయటపడింది. ఈ సందర్భంగా దేవి నాగవల్లి కాస్తా దూకుడుగా మాట్లాడి .... అసలు హౌసే ఓ పెద్ద డ్రామా అన్నట్టు తేల్చి చెప్పింది. ఒకింత భావోద్వేగానికి గురైన దేవి ఏమన్నారంటే...
"బిగ్బాస్ పిచ్చి కామెడీ దారిలో వెళుతోంది. కామెడీ చేస్తే ఇక్కడ హీరోలా? అమ్మా రాజశేఖర్ హీరో ఎంత మాత్రం కాదు. చిల్లర కామెడీ అక్కర్లేదు. కొంత మందిపై పక్షపాతంతోనూ, మరికొందరి పట్ల ద్వేషాన్ని ప్రదర్శిస్తున్నారు. నేను కిచెన్లో కొన్ని రూల్స్ పెడితే అమ్మా రాజశేఖర్ కాదన్నారు. కొందరు గ్రూపులుగా విడిపోయి ఆట ఆడుతున్నారు. ఆ గ్రూప్నకు అమ్మా రాజశేఖర్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. నామి నేషన్ ప్రక్రియ తర్వాత నుంచి నన్ను వేరు చేసి చూస్తున్నారు " అని ఆవేదన వ్యక్తం చేశారామె.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు