కత్రినా కైఫ్ నటనలో మాత్రమే కాదు....సామాజిక అంశాల్లో కూడా చురుగ్గా వ్యవహరిస్తుంటారు. సామాజిక, రాజకీయ అంశాలపై తనకంటూ కొన్ని నిశ్చితమైన అభిప్రాయాలను ఆమె కలిగి ఉన్నారు. ఆమె అభిప్రాయాలు వింటే ‘అబ్బా కత్తిలా పదునైన మాటలు’ అని అనక తప్పదు. కరోనా వైరస్తో సమాజంలో తలెత్తిన సమస్యలు, లాక్డౌన్ తర్వాత వ్యవస్థలో చోటు చేసుకునే మార్పులపై ఆమె పదునైన అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
‘కరోనా వైరస్ కారణంగా తలెత్తిన పరిస్థితులు జీవితం పట్ల నాకు ఉండే దృష్టి కోణాన్ని మార్చివేశాయి’ అని కత్రినా కైఫ్ చెప్పిన ఒకే ఒక్క వాక్యంతో , ఆమె భావజాలాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ విషయమై కత్రినా మరింత వివరించారు.
‘ప్రపంచం మొత్తం ముందుకెళుతున్న సమయంలో కరోనా వచ్చి వెనక్కి నెట్టింది. కరోనాకు ముందు మన జీవితాలు ఎలా సాగాయి? అని ఆలోచిస్తే.. ఇకముందు అప్పటి పరిస్థితులు ఉంటాయా? అనే సందేహం కలుగుతోంది. మన సాధారణ జీవితం మనకు తిరిగి ఎప్పుడు లభిస్తుందో చెప్పలేం. దేశంలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అందుకే మనం రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మన ఆహారపు అలవాట్లు కూడా ఆరోగ్యకరమైనవిగా ఉండటమే మంచిది. నలుగురితో కలిసిమెలిసి ఉండాలంటారు. కానీ ఇప్పుడు నలుగురి క్షేమం కోసం దూరంగా ఉండటమే మంచిది. కరోనాని తరిమేశాక ఈ దూరాన్ని కూడా తరిమేద్దాం’ అని కత్రినా అన్నారు.
సహజంగా సినిమా వాళ్లకు బాహ్య ప్రపంచం గురించి ఏమీ తెలియదనుకుంటారు. కానీ కత్రినా మాటలు విన్న తర్వాత తమ అభిప్రాయాల్ని మార్చుకుంటారు. ఎందుకంటే ఆమె వెల్లడించిన ప్రతి అభిప్రాయం ఎంతో విలువైంది. ఇప్పుడు నలుగురి క్షేమం కోసం దూరంగా ఉండటమే మంచిదని, కరోనాని తరిమేశాక ఈ దూరాన్ని కూడా తరిమేద్దాం అని ఆమె చెప్పిన మాట వెలకట్టలేనిది. గతంలో కూడా కత్రినా అనేక విలువైన ఆధ్యాత్మిక చింతనతో కూడిన అభిప్రాయాలు వెల్లడించి ప్రశంసలు అందుకున్నారు.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు