Advertisement

Advertisement


Home > Movies - Movie News

కరోనాపై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

కరోనాపై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

రీసెంట్ గా హీరోయిన్ నివేత థామస్ పై ఓ మోస్తరు ట్రోలింగ్ నడిచిన సంగతి తెలిసిందే. కరోనాతో క్వారంటైన్ లో ఉన్న ఆమె సడెన్ గా సినిమా హాల్ లో ప్రత్యక్షమైంది. వకీల్ సాబ్ సినిమా చూస్తుండగా దిగిన ఫొటోల్ని సోషల్ మీడియాలో కూడా పెట్టింది. దీనిపై చాలామంది ఆగ్రహం వ్యక్తం చేశారు.

తనపై ట్రోలింగ్ స్టార్ట్ అయిన కొన్ని గంటల వ్యవథిలోనే దానిపై క్లారిటీ ఇచ్చింది నివేత థామస్. తనకు కరోనా తగ్గిపోయిందని, నెగెటివ్ వచ్చిందని, అందుకే థియేటర్ లోకి వచ్చానని స్పష్టత ఇచ్చింది.

"కరెక్ట్ గా ప్రమోషన్ టైమ్ లో నాకు కొవిడ్ రావడం కొంత బాధగా అనిపించింది. అయితే రైట్ టైమ్ కు నాకు మళ్లీ నెగిటివ్ వచ్చింది. థియేటర్ కు వెళ్లి సినిమా చూద్దామని అనుకున్నాను. ఎప్పటిలా ఆరోగ్యంగా కావాలంటే బయట తిరగకుండా ఇంకొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు చెప్పారు. దాంతో ఆగిపోయాను. నాకు మాత్రం ఒక్కసారి బయటకు వెళ్లి థియేటర్లలో ఆడియెన్స్ రెస్పాన్స్ ఎలా ఉందో చూడాలని అనిపించింది. అందుకే థియేటర్ కు వెళ్లాను."

ఇలా తనకు కరోనా తగ్గిపోయిందనే విషయాన్ని ప్రకటించింది నివేత థామస్. కొవిడ్ వల్ల ప్రేక్షకుల్ని నేరుగా కలవలేకపోయినప్పటికీ.. వాళ్లు పెడుతున్న పోస్టుల్ని సోషల్ మీడియాలో రెగ్యులర్ గా చూస్తున్నానని.. తనకొచ్చిన మెసేజీల్ని ఒక్కటి కూడా వదలకుండా చదివానని చెప్పుకొచ్చింది.

కరోనా జాగ్రత్తల్ని పాటిస్తూ.. అందరూ మాస్కులు పెట్టుకొని, సామాజిక దూరం పాటిస్తూ వకీల్ సాబ్ సినిమాను థియేటర్లలో చూడాలని కోరుతోంది నివేత. ప్రస్తుతం ఈ బ్యూటీ... సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మిడ్ నైట్ రన్నర్స్ అనే కొరియన్ సినిమా రీమేక్ లో నటిస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?