Advertisement

Advertisement


Home > Movies - Movie News

తిరుపతిలోనే పెళ్లి.. సౌతిండియన్ భోజనమే!

తిరుపతిలోనే పెళ్లి.. సౌతిండియన్ భోజనమే!

శ్రీదేవి పెద్దకూతరు జాన్వీకపూర్ కు సౌతిండియా మీద చాలా మమకారమే ఉంది. అలాగే తన తల్లి పూర్వీకుల ప్రాంతంపై కూడా జాన్వీకి చాలా ప్రేమ ఉన్నట్టుంది. ఎంతలా అంటే.. తన పెళ్లి తిరుపతిలోనే జరుగుతుందని జాన్వీ ప్రకటించింది. పెళ్లి భోజనంలో సౌతిండియన్ స్పెషల్సే ఉంటాయని తేల్చిచెప్పింది. అవంటే తనకు చాలా ఇష్టమని.. వాటినే పెళ్లిలో వడ్డించడం జరుగుతుందని వివరించింది జాన్వీకపూర్.

ఇప్పటికే వివిధ సందర్భాల్లో ఎలాగోలా సౌత్ ప్రస్తావన తీసుకువచ్చే జాన్వీ పెళ్లి వేదిక విషయంలో తిరుపతే అని అంటోంది. శ్రీదేవి పూర్వీకులది చిత్తూరుజిల్లా. వారితో శ్రీదేవి చివరి వరకూ సత్సంబంధాలనే నెరిపింది. ఆమె మరణించినప్పుడు పలువురు ఆ విషయాలను తెలిపారు.

ఇక సౌతిండియన్లకు పెళ్లి వేదికగా తిరుపతి ఎంత ఇష్టమో చెప్పనక్కర్లేదు. నిత్యకళ్యాణం పచ్చతోరణంగా తిరుపతి పెళ్లిళ్లకు వేదిక అవుతూ ఉంటుంది. అలా జాన్వీ కూడా అక్కడే పెళ్లి చేసుకోవాలని అనుకుంటోందట. పెళ్లి వేదిక సరే, ఇంతకీ పెళ్లి కొడుకు ఎవరంటే జాన్వీ ఇంకా చెప్పడంలేదు.

తనకు ప్రేమికుడిని ఎంపిక చేసుకోవడంలో శక్తిలేదని.. తన తల్లి చెప్పేదని జాన్వీ చెబుతోంది. పెళ్లికొడుకును ఆమే చేస్తానంటూ తనతో అనేదని జాన్వీ వివరించింది. 

జగన్‌ పాలన.. 'హాఫ్‌' మార్కును చేరిన అభినందనలు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?