Advertisement

Advertisement


Home > Movies - Movie News

మట్టికుస్తీ' కనెక్ట్ టు ఆల్

మట్టికుస్తీ' కనెక్ట్ టు ఆల్

కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ నటించిన సినిమా మట్టి కుస్తీ. చెల్లా అయ్యావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ, స్పోర్ట్స్ డ్రామా ఇది. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ సినిమాను తెలుగులో హీరో రవితేజ అందిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ రెండున విడుదల అవుతున్న నేపథ్యంలో శనివారం సాయంత్రం మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. 

ఫ్యాన్స్ తో ఇంటరాక్షన్ కోసం నిర్వహించిన ఈ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో హీరో విష్ణు విశాల్, హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి పాల్గొని సందడి చేశారు. సినిమాలోని పాటకు స్టెప్పులేసి అభిమానులను అలరించారు. 

అనంతరం విష్ణు విశాల్ మాట్లాడుతూ.. ‘‘నేను జ్వాలా గుత్తాను పెళ్లి చేసుకున్న విషయం మీకు తెలిసిందే. నేను తెలుగింటి అల్లుడిని. నేను జ్వాలాని పెళ్లి చేసుకున్నాక తెలుగు సినిమాలు చేయమని నన్ను హైదరాబాద్‌ కు తీసుకొచ్చింది. నా కెరీర్ లో అతిపెద్ద సినిమా ‘మట్టి కుస్తీ’తో ఇప్పుడు నేను మీ ముందుకు వచ్చాను. ఇందుకు కారణమైన జ్వాలాకు, నన్ను నమ్మి సినిమాను నిర్మించిన రవితేజ సర్‌ కు ధన్యవాదాలు. రాక్షసన్, అరణ్య, ఎఫ్ఐఆర్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు నేను తెలుసు. ఇప్పుడు మట్టి కుస్తీతో మీ ముందుకు వస్తున్నా. ఎంటర్ టైన్ మెంట్, కంటెంట్ ఉన్న సినిమాలను తెలుగు ఆడియన్స్ ఎంతగానో ఆదరిస్తారు. మా మట్టి కుస్తీ లో ఎంటర్ టైన్ మెంట్ తో పాటు మంచి కంటెంట్ ఉంది. అందరూ ఈ సినిమాను థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయాలని కోరుతున్నా.’’ అన్నారు. 

ఐశ్వర్య లక్ష్మి మాట్లాడుతూ.. ‘‘నేను చేసిన ‘అమ్ము’, ‘పొన్నియన్ సెల్వన్’ సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. అలాగే ఈ ‘మట్టి కుస్తీ’ సినిమాను కూడా థియేటర్లలో చూసి ఆదరించాలని కోరుకుంటున్నా. రవితేజ సర్ విష్ణు విశాల్ సర్‌ ను నమ్మి ఖర్చుకు వెనకాడకుండా ఎంతో గ్రాండియర్‌ గా ఈ సినిమాను నిర్మించారు. రవితేజ గారి వల్లే నేను ఇప్పుడు మీ ముందుకు వచ్చా. డిసెంబర్ 2న థియేటర్లలో మా సినిమాను చూసి ఆదరించండి’’ అన్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?