Advertisement

Advertisement


Home > Movies - Movie News

మెగాస్టార్‌లో ఆత్రుత‌

మెగాస్టార్‌లో ఆత్రుత‌

త‌మ్ముడు ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన వ‌కీల్‌సాబ్ సినిమా చూసేందుకు తాను కూడా ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్న‌ట్టు మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ఈ నెల 9న వ‌కీల్‌సాబ్ విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే. 

హిందీలో ఘ‌న విజ‌యం సాధించిన ‘పింక్‌’ చిత్రానికి రీమేక్‌ ఈ ‘వకీల్‌సాబ్‌’. ఈ సినిమా త‌మిళ రీమేక్ చూసిన త‌ర్వాత తెలుగులో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో చేస్తే బాగుంటుంద‌ని అనుకున్న‌ట్టు ఇటీవ‌ల నిర్మాత దిల్‌రాజ్ చెప్పారు. ఆయ‌న అనుకున్న‌ట్టే జ‌రిగింది.

ఈ చిత్రాన్ని డైరెక్టర్‌ వేణు శ్రీరామ్‌ తెరకెక్కించారు. పవన్‌కు జోడీగా శ్రుతిహాసన్‌ నటించారు. నివేదా థామస్‌, అంజలి, అనన్య కీలక పాత్రల్లో న‌టించారు. బోనీ కపూర్‌ సమర్పణలో దిల్‌రాజు, శిరీష్‌ సంయుక్తంగా నిర్మించిన చిత్రానికి తమన్‌ సంగీతం అం దించారు. ప‌వ‌న్ రాజ‌కీయాల్లోకి వెళ్లిన త‌ర్వాత, తిరిగి న‌టించిన తొలి సినిమా కావ‌డంతో ఆయ‌న అభిమానుల్లోనే కాకుండా అంద‌రిలోనే చూడాల‌నే ఎగ్జైట్‌మెంట్ ఉంది.

ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ అన్న‌, మెగాస్టార్ చిరంజీవి తాజాగా సినిమాపై ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌లో సినిమా చూడాల‌న్న ఆస‌క్తిని వ్య‌క్త‌ప‌రిచారు. అలాగే ప‌వ‌న్‌కు జుట్టు దువ్వుతున్న పాత ఫొటోను అభిమానుల‌తో పంచుకున్నారు.

‘చాలాకాలం తర్వాత పవన్‌కల్యాణ్‌ను వెండితెర మీద చూడటానికి మీలాగే నేను కూడా ఎదురు చూస్తున్నాను. అమ్మ, కుటుంబసభ్యులతో రేపు సాయంత్రం థియేటర్‌లో వకీల్‌సాబ్‌ చూడనున్నాం. సినిమా చూసిన తర్వాత నా స్పందన మీతో పంచుకోవాలని ఎంతో ఆత్రుతగా ఉన్నాను’ అని ట్వీట్‌లో చిరంజీవి పేర్కొన్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?