పట్టుమని పది సినిమాలు కూడా చేయలేదు పాయల్ ఘోష్. 12 యేళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. ఈమెకు అవకాశాలు లేవు. ఈమె ఎవరో కూడా జనాలు దాదాపు మరిచిపోయిన పరిస్థితి. ఇలాంటి సమయంలో తనను ఒక బాలీవుడ్ డైరెక్టర్ వేధించాడని అంటూ చేసిన వ్యాఖ్యానాలతో టాక్ ఆఫ్ ద డౌన్ గా మారింది. ఈమె ఎవరనే అంశం గురించి గూగుల్ సెర్చింగ్ మొదలైంది. రాత్రికి రాత్రి ఈమె బోలెడంత 'గుర్తింపు'ను పొందింది!
విశేషం ఏమిటంటే.. ఈమె సినిమా కెరీర్ తెలుగుతోనే మొదలైంది. ఇప్పుడెప్పుడో మంచు మనోజ్ హీరోగా దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి రూపొందించిన ప్రయాణం అనే సినిమాతో హీరోయిన్ గా మారింది పాయల్ ఘోష్. అంతకు ముందు ఈమె బీబీసీ వాళ్లు తీసిన ఒకదాంట్లో నటించింది. కానీ అదేమీ ఫీచర్ ఫిల్మ్ కాదు. ఈమె తొట్టతొలి ఫీచర్ ఫిల్మ్ తెలుగుదే.
ఆ సినిమా అంతంత మాత్రంగా ఆడటంతో.. పాయల్ ను తెలుగు సినిమా వాళ్లు పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత కొంత కాలానికి ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఊసరవెల్లి సినిమాలో హీరోయిన్ తమన్నా ఫ్రెండ్ రోల్ లో పాయల్ కనిపించింది. కాస్త కామెడీ చేసింది కానీ, ఆ తర్వాత ఈమెకు తెలుగులో కూడా చెప్పుకోదగిన అవకాశాలు రాలేదు. ఒకటీ అర చిన్న తెలుగు సినిమాల్లో నటించింది. ఒక్కటంటే ఒక్క హిందీ సినిమాలో నటించింది. మరో సినిమాలో ఇప్పడు నటిస్తోందట.
ఇలా 12 యేళ్లలో నాలుగైదు సినిమాల్లో నటించిన పాయల్ ఘోష్ కు వాటితో రాని గుర్తింపు అనురాగ్ కశ్యప్ పై చేసిన ఆరోపణలతో వచ్చింది. అయితే అనురాగ్ తనను వేధించాడు అనడానికి ఆధారాలేవీ తన దగ్గర లేదని ఆమె స్వయంగా చెబుతోంది! మరి ఈ వివాదం వెనుక అసలు కథేంటో!
ఇక బాలీవుడ్ ను ఇప్పుడు షేక్ చేస్తున్న కంగనా రనౌత్ కూడా తన కెరీర్ ఆరంభంలో తెలుగులో నటించింది. ఇలా తెలుగు పరిశ్రమలో పని చేసిన వారు హిందీలో సంచలన ఆరోపణలతో దుమ్మ రేపుతున్నారు. మరి వీళ్లకు టాలీవుడ్ లో అలాంటి అనుభవాలు ఎదురుకాలేదేమో!
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు